Honey Rose: హనీ రోజ్ ఇదివరకే పలు తెలుగు సినిమాలలో నటించి సందడి చేశారు. ఈమె గతంలో ఆలయం ఈ వర్షం సాక్షిగా వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమాలో తనకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదని చెప్పాలి. తెలుగులో ఇలా తనకు మంచి గుర్తింపు లభించకపోవడంతో మలయాళంలోనే సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు.
తాజాగా ఈమె గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఈమె బాలకృష్ణకు భార్య పాత్రలో నటించారు. ఇలా వీర సింహారెడ్డి సినిమా ద్వారా హనీ రోజ్ నటనకు పెద్ద ఎత్తున ప్రశంసలు అందడమే కాకుండా ఈమెకు తెలుగులో మంచి గుర్తింపు కూడా లభించింది. ఇక ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి హనీ రోజ్ వరుస అవకాశాలను అందుకుంటున్నారు.
ఈ సినిమా ద్వారా తెలుగులో కూడా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి ఈమె ప్రస్తుతం వరుస సినిమాలు ప్రమోషన్ కార్యక్రమాలతో ఎంతో బిజీగా మారిపోయారు. ఈ క్రమంలోనే పలు రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కార్యక్రమాలలో కూడా బిజీగా మారిపోయారు.
ఇలా పలు షాపింగ్ మాల్స్ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె గురించి ఒక షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా షాపింగ్ మాల్స్ లేదా రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి వెళ్లిన,ఏదైనా బ్రాండ్ ప్రమోట్ చేయాలన్న ఈమె భారీగానే డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇలా ఒక్కొక్క ప్రమోషన్ కోసం హనీ రోజ్ ఏకంగా ఎనిమిది నుంచి పది లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…