Rashmika: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి హీరోయిన్ రష్మిక మందన్న గురించి పరిచయం అవసరం లేదు. కిరిక్ పార్టీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన ఈమె అనంతరం ఇతర భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు.
ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాష చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి రష్మిక నేడు తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈమె తన సినీ కెరియర్ గురించి చేసినటువంటి కొన్ని కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తనకు మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చింది అనే విషయాల గురించి తెలియజేశారు.
గతంలో తనకు మొదటి సినిమా ఎలా వచ్చిందనే విషయం గురించి మాట్లాడుతూ ఓ అందాల పోటీలలో తాను గెలవడంతో తన ఫోటో పేపర్లో వేశారని ఆ ఫోటో చూసి తనకు సినిమా అవకాశం ఇచ్చారని చెప్పారు. అయితే తాజాగా మరోసారి ఈ విషయం గురించి రష్మిక మాట్లాడుతూ… నా ఫోటో చూసి దర్శక నిర్మాతలు తనకు ఫోన్ చేశారని అయితే అది ఫ్రాంక్ కాల్ అనుకొని తాను నాకు సినిమాలపై ఎలాంటి ఆసక్తి లేదు ఫోన్ పెట్టేయండని చెప్పి ఆ నెంబర్ బ్లాక్ చేశానని తెలిపారు.
ఈ విధంగా తాను నెంబర్ బ్లాక్ చేయడంతో దర్శక నిర్మాతలు తన స్నేహితులను కలిసే ప్రయత్నాలు చేసిన ఫలించలేదు. చివరికి మా స్కూల్ టీచర్ల ద్వారా తనని కలిసారని ఈ సందర్భంగా రష్మిక తెలియజేశారు. అయితే నాకు నటించడం రాదని చెప్పడంతో వాళ్లు తన చేత కొన్ని డైలాగ్స్ చెప్పించి రికార్డ్ చేసుకుని వెళ్లారని తిరిగి తనకు సినిమా అవకాశం ఇచ్చినట్లు ఈ సందర్భంగా రష్మిక తన మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చింది అనే విషయం గురించి చెబుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…