భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ రెండు రోజుల క్రితం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ కు చెందిన మహిపాల్ సింగ్ అనే వ్యక్తి కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 24 గంటల తరువాత మృతి చెందాడు. వార్డ్ బాయ్ గా పని చేసే మహిపాల్ సింగ్ ఛాతీలో నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలతో మృతి చెందాడు. దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైన తరువాత ఫ్రంట్ లైన్ వర్కర్లకు మొదట కరోనా వ్యాక్సిన్ ను ఇచ్చారు.
46 సంవత్సరాల వయస్సు ఉన్న మహిపాల్ సింగ్ శనివారం మధ్యాహ్నం కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నారు. వ్యాక్సిన్ ను తీసుకున్న 24 గంటల తరువాత ఊపిరి ఆడకపోవడం వల్ల చనిపోయాడని మహిపాల్ సింగ్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందే జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నాడని సమాచారం. శనివారం కరోనా వ్యాక్సిన్ ను తరువాత మహిపాల్ మరింత అనారోగ్యానికి గురయ్యాడని మహిపాల్ కుమారుడు విశాల్ తెలిపారు.
జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎంసీ గార్గ్ మాత్రం కరోనా వ్యాక్సిన్ వల్ల మహిపాల్ మృతి చెందాడని అనుకోవడం లేదని మహిపాల్ మృతికి మరేదైనా కారణం ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మహిపాల్ సింగ్ పోస్టుమార్టం రిపోర్ట్ లో అతను కార్డియో-పల్మనరీ డిసీజ్ వల్ల చనిపోయాడని వెల్లడైందని తెలిపారు. శనివారం రోజున యూపీ రాష్ట్రంలో 22,643 మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరిగిందని జనవరి 22వ తేదీన రెండో విడత టీకా పంపిణీ జరుగుతుందని అన్నారు.
మహిపాల్ కు గతంలో కరోనా వైరస్ సోకలేదని తెలుస్తోంది. పోస్ట్ మార్టం నివేదిక వెల్లడైనా అతని కుటుంబ సభ్యులు మాత్రం కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ కారణంగానే మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను మహిపాల్ సింగ్ తీసుకున్నారని సమాచారం.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…