Actress Radha: సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి నటి రాధా గురించి పరిచయం అవసరం లేదు ఒకానొక సమయంలో ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందారు. ఇలా సౌత్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగినటువంటి రాధా పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు.
ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె తన పెద్ద కుమార్తె కార్తీకను ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం చేశారు. నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమా ద్వారా హీరోయిన్గా ఈమె కూడా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా పలు సినిమాలలో నటించిన కార్తీక ఇండస్ట్రీలో అనుకున్న స్థాయిలో సక్సెస్ రాలేకపోయింది. దీంతో ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో పడ్డారు అయితే వ్యాపార రంగంలో మాత్రం మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక ఇటీవల కార్తీక రోహిత్ మీనన్ అనే వ్యాపారవేత్తను ఎంతో ఘనంగా కేరళలో వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. వీరి వివాహ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఈ పెళ్లి వేడుకలలో భాగంగా అందరి చూపు కార్తిక వేసుకున్న నగలపైనే ఉంది. ఈమె ఒంటినిండా చాలా పెద్ద పెద్ద నగలను ధరించి కనపడటంతో అసలు కార్తీకకు తన తల్లి ఎంత మొత్తంలో కట్న కానుకలు ఇచ్చారన్న సందేహాలు అందరిలోనూ తలెత్తాయి.
కోట్లు విలువచేసే కట్న కానుకలు..
సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం రాదా తన కుమార్తె కోసం భారీ స్థాయిలోనే కట్న కానుకలు ఇచ్చారట. సినిమాల నుంచి తప్పుకున్నటువంటి కార్తిక దుబాయిలో ఒక రెస్టారెంట్ బాధ్యతలను పూర్తిగా తీసుకొని నిర్వహించేవారు. అయితే ఈ రెస్టారెంట్ ను పూర్తిగా తన పేరు మీద రాసిచ్చారని తెలుస్తుంది. దీనితోపాటు తన అల్లుడి కోసం కోట్లు విలువ చేసే ఖరీదైన కారుని కూడా ఇచ్చారట. అలాగే 30 కోట్లకు పైగా విలువచేసే బంగారు వజ్రభరణాలను కూడా కానుకగా ఇచ్చారని తెలుస్తోంది. ఏది ఏమైనా కూతురికి మాత్రం భారీ స్థాయిలోనే ఈమె కట్న కానుకలు ఇచ్చారని చెప్పాలి.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…