Actress Radha: సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి నటి రాధా గురించి పరిచయం అవసరం లేదు ఒకానొక సమయంలో ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందారు. ఇలా సౌత్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగినటువంటి రాధా పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు.
ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె తన పెద్ద కుమార్తె కార్తీకను ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం చేశారు. నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమా ద్వారా హీరోయిన్గా ఈమె కూడా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా పలు సినిమాలలో నటించిన కార్తీక ఇండస్ట్రీలో అనుకున్న స్థాయిలో సక్సెస్ రాలేకపోయింది. దీంతో ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో పడ్డారు అయితే వ్యాపార రంగంలో మాత్రం మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక ఇటీవల కార్తీక రోహిత్ మీనన్ అనే వ్యాపారవేత్తను ఎంతో ఘనంగా కేరళలో వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. వీరి వివాహ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఈ పెళ్లి వేడుకలలో భాగంగా అందరి చూపు కార్తిక వేసుకున్న నగలపైనే ఉంది. ఈమె ఒంటినిండా చాలా పెద్ద పెద్ద నగలను ధరించి కనపడటంతో అసలు కార్తీకకు తన తల్లి ఎంత మొత్తంలో కట్న కానుకలు ఇచ్చారన్న సందేహాలు అందరిలోనూ తలెత్తాయి.
కోట్లు విలువచేసే కట్న కానుకలు..
సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం రాదా తన కుమార్తె కోసం భారీ స్థాయిలోనే కట్న కానుకలు ఇచ్చారట. సినిమాల నుంచి తప్పుకున్నటువంటి కార్తిక దుబాయిలో ఒక రెస్టారెంట్ బాధ్యతలను పూర్తిగా తీసుకొని నిర్వహించేవారు. అయితే ఈ రెస్టారెంట్ ను పూర్తిగా తన పేరు మీద రాసిచ్చారని తెలుస్తుంది. దీనితోపాటు తన అల్లుడి కోసం కోట్లు విలువ చేసే ఖరీదైన కారుని కూడా ఇచ్చారట. అలాగే 30 కోట్లకు పైగా విలువచేసే బంగారు వజ్రభరణాలను కూడా కానుకగా ఇచ్చారని తెలుస్తోంది. ఏది ఏమైనా కూతురికి మాత్రం భారీ స్థాయిలోనే ఈమె కట్న కానుకలు ఇచ్చారని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…