General News

Air India plane crash : బాధితులకు నష్టపరిహారం ఎంత ఇస్తారు? ఎయిర్ ఇండియా ఏమంటుంది?

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం విషయం మీకు తెలుసు. ఈ ప్రమాదంలో 274 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 241 మంది ప్రయాణికులు కాగా, మిగిలిన వారు వైద్య సిబ్బంది. విమానం వైద్య కళాశాల వసతి గృహంపై కూలడంతో భవనం పూర్తిగా ధ్వంసమైంది.

How much compensation will be given to the victims? What does Air India say?

ప్రమాదం సమయంలో 24 మంది మరణించగా, గాయపడిన వారు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో తొమ్మిది మంది చనిపోయారు. దీంతో మరణాల సంఖ్య 33కి చేరింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రమాదంలో బాధితులైన కుటుంబాలకు నష్టపరిహారం ఎంత ఇస్తారు?

విమానానికి బీమా సదుపాయం ఉంటుంది. బీమా సంస్థ నుంచి నష్టాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ విమాన ప్రమాదం దేశ చరిత్రలోనే అతిపెద్ద ఏవియేషన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌గా నమోదవుతోంది. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత విమానయాన సంస్థదే.

1999 నాటి మాంట్రియల్ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం, విమానం ప్రమాదానికి గురై ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగితే, సంబంధిత విమానయాన సంస్థే ఆ నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. విమానంలో ప్రయాణికుల వస్తువులు, సామాగ్రి ధ్వంసమైనా, అవి వారికి అందడంలో ఆలస్యం జరిగినా పరిహారం ఇవ్వాల్సిందే.

ఎయిర్ ఇండియా టాటా గ్రూప్ యాజమాన్యంలో ఉంది. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానాన్ని దాదాపు రూ.960 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించింది. అయితే, అహ్మదాబాద్‌లో జరిగిన ప్రమాదంలో, నిబంధనల ప్రకారం, ఎయిర్ ఇండియా సంస్థ ఒక్కో బాధిత కుటుంబానికి 1,51,880 స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ఎస్డీఆర్ విలువ దాదాపు రూ. 120. ఈ లెక్కన ఒక్కో కుటుంబానికి రూ.1.80 కోట్లు పరిహారం ఇవ్వాల్సి ఉంది.

మాంట్రియల్ తీర్మానం కింద ఇచ్చే పరిహారంతో పాటు, ఒక్కో కుటుంబానికి అదనంగా రూ.కోటి చొప్పున ఇస్తామని టాటా గ్రూప్ ప్రకటించింది. అంటే ఒక్కో కుటుంబానికి రూ.2.80 కోట్ల పరిహారం దక్కబోతోంది

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago