ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలు చేసే వాళ్లు పీఎఫ్ అకౌంట్ ను కలిగి ఉంటారనే సంగతి తెలిసిందే. ఉద్యోగుల ఖాతాలలో త్వరలో ప్రొవిడెంట్ ఫండ్ సంస్థ 2019 – 2020 సంవత్సరానికి సంబంధించిన పీఎఫ్ మొత్తాలపై వడ్డీ రేటును జమ చేయనుంది. 8.5 శాతం వడ్డీ ఉద్యోగుల ఖాతాలలో జమ కానుంది. ఈ నెల చివరినాటికి వడ్డీ పీఎఫ్ ఖాతాలలో జమ కానుండగా పీఎఫ్ అకౌంట్ ఉన్నవారు సులభంగా బ్యాలన్స్ ను తెలుసుకోవచ్చు.
పీఎఫ్ ఖాతాదారులకు ఉమాంగ్ యాప్ ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. ఉమాంగ్ యాప్ సహాయంతో సులభంగా పీఎఫ్ అకౌంట్ యొక్క బ్యాలన్స్ ను తెలుసుకోవచ్చు. అయితే పీఎఫ్ అకౌంట్ ఉన్నవారు ఉమాంగ్ యాప్ లో మొదట ఈ.పీ.ఎఫ్.వోను ఎంచుకుని ఆ తరువాత ఎంప్లాయి సెంట్రిక్ సర్వీసెస్ ను ఎంచుకుని వ్యూ పాస్ బుక్ పై క్లిక్ చేయాలి. ఆ తరువాత పీఎఫ్ ఖాతాకు సంబంధించిన యూఏఎన్ నంబర్ ను, ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత యాప్ లో మెంబర్ ఐడీ కనిపిస్తుంది. మెంబర్ ఐడిపై క్లిక్ చేసి సులభంగా పీఎఫ్ బ్యాలన్స్ ను తెలుసుకోవచ్చు. అయితే ఎవరైతే పీఎఫ్ అకౌంట్ తో మొబైల్ నంబర్ ను లింక్ చేసి ఉంటారో వారు మాత్రమే ఈ వివరాలను పొందగలిగే అవకాశం ఉంటుంది. ఉమాంగ్ యాప్ తో కాకుండా 011 – 22901406 నంబర్ కు ఫోన్ చేయడం ద్వారా కూడా సులభంగా పీఎఫ్ బ్యాలన్స్ ను తెలుసుకునే ఉంది.
కాల్ చేసిన తరువాత కొంత సమయానికే మెసేజ్ రూపంలో బ్యాలన్స్ కు సంబంధించిన వివరాలు మొబైల్ ఫోన్ కు వస్తాయి. www.epfindia.gov.in వెబ్ సైట్ ద్వారా కూడా సులభంగా బ్యాలెన్స్ వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ.పీ.ఎఫ్.వో పోర్టల్ లో అవర్ సర్వీసెస్ లోని మెంబర్ పాస్ బుక్ విభాగంలోకి వెళ్లి యూఏఎన్ నంబర్, పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి సులభంగా బ్యాలెన్స్ ను తెలుసుకోవచ్చు. “epfoho uan” అని టైప్ చేసి 7738299899 నంబర్ కు మెసేజ్ పంపించడం ద్వారా కూడా సులభంగా పీఎఫ్ బ్యాలన్స్ ను తెలుసుకునే అవకాశం ఉంటుంది.
సోషల్ మీడియా శక్తి మరోసారి మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్వికకు దేశవ్యాప్తంగా వచ్చిన సహకారం,…
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…