దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ తీవ్రతరంగా మారడంతో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. ఈ క్రమంలోనే మరికొన్ని రాష్ట్రాలు ప్రభుత్వ కార్యకలాపాలు పనివేళలు కూడా మార్చారు. ఇలాంటి తరుణంలోనే బ్యాంకు సిబ్బంది కూడా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనివేళలో మార్పులు చేస్తూ, కేవలం 50 శాతం మంది సిబ్బందితోనే విధులు నిర్వర్తించాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సంఘం తెలిపింది.
తాజాగా తెలంగాణలో కూడా పది రోజుల పాటు లాక్ డౌన్ విధించడంతో బ్యాంకు పనివేళలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. నిన్నటి వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విధులు నిర్వర్తించిన బ్యాంకులు నేటి నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పని చేయనున్నాయి. ఇప్పటికే బ్యాంకులలో కేవలం 50 శాతం మంది సిబ్బందితోనే విధులు నిర్వర్తిస్తున్నారు.
తెలంగాణలో పది రోజులు లాక్ డౌన్ విధిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంలో సాధారణ కార్యకలాపాలకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతి తెలిపింది. ఈ క్రమంలోనే బ్యాంకు పనివేళలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయని, ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే బ్యాంకు సేవలు అందుబాటులో ఉంటాయని
రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఆదేశాలు జారీ చేసింది.
బ్యాంకులకు మారిన పని వేళలో భాగంగా కేవలం అత్యవసరమైన సేవలను మాత్రమే అందించాలని, మిగతా ఎటువంటి సేవలైన ఆన్లైన్ ద్వారా నిర్వర్తించాలని బ్యాంకర్ల సమితి ఆదేశాలు జారీ చేసింది.ఇకపోతే ఏటీఎంలలో డబ్బులు భర్తీ చేసే వారు బ్యాంకు వచ్చే సమయంలో తప్పనిసరిగా వారి గుర్తింపు కార్డును తెచ్చుకోవాలనే సూచనలను కూడా తెలిపింది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…