దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో రోజు రోజుకు కేసుల సంఖ్య అధికమవుతున్నాయి. ఈ క్రమంలోనే రోజుకు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. మొదటి దశలో ఎక్కువగా వృద్ధులు మృత్యువాత పడగా రెండవ దశలో యువకులు సైతం అధిక సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. కానీ,ఇంతటి భయంకరమైన మహమ్మారి నుంచి 110 ఏళ్ల వృద్ధుడు కరోనాను జయించి ఎంతో ఆరోగ్యంగా బయటపడ్డాడు.
హైదరాబాద్ లో కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ ఎంతో మంది మరణిస్తున్నారు. ఈ క్రమంలోనే గాంధీ ఆస్పత్రిలో కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్న 110 సంవత్సరాల రామానంద తీర్థ అనే వ్యక్తి కరోనాను జయించి ఆరోగ్యంగా ఉండడంతో ఎంతో మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.
రామానంద తీర్థ(110) కీసరలోని ఓ ఆశ్రమంలో ఉంటున్నారు. ఇటీవల ఆయనకు స్వల్ప కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. వైద్యుల సూచనల మేరకు ఏప్రిల్ 24న గాంధీ ఆస్పత్రిలో చేరిన రామానందతీర్థకు ఆక్సిజన్ స్థాయిలు 92 గా ఉండడంతో అతనికి ఐసియు వార్డులో కోవిడ్ చికిత్స అందించారు. దాదాపు మూడు వారాల చికిత్స అనంతరం రామానందతీర్థకి మరోసారి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అతనికి నెగిటివ్ వచ్చింది.
110 ఏళ్ల వయసులో కరోనా బారినపడి విజయవంతంగా కరోనా నుంచి బయటపడిన రామతీర్థ కి ఇతర ఎటువంటి జబ్బులు లేకపోవడంతోనే అతను తొందరగా కరోనా నుంచి కోలుకొని బయటపడినట్లు
గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు వెల్లడించారు.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…