General News

కరోనాను జయించిన 110 ఏళ్ల వృద్ధుడు.. గాంధీ ఆస్పత్రిలో దిక్కు?

దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో రోజు రోజుకు కేసుల సంఖ్య అధికమవుతున్నాయి. ఈ క్రమంలోనే రోజుకు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. మొదటి దశలో ఎక్కువగా వృద్ధులు మృత్యువాత పడగా రెండవ దశలో యువకులు సైతం అధిక సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. కానీ,ఇంతటి భయంకరమైన మహమ్మారి నుంచి 110 ఏళ్ల వృద్ధుడు కరోనాను జయించి ఎంతో ఆరోగ్యంగా బయటపడ్డాడు.

హైదరాబాద్ లో కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ ఎంతో మంది మరణిస్తున్నారు. ఈ క్రమంలోనే గాంధీ ఆస్పత్రిలో కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్న 110 సంవత్సరాల రామానంద తీర్థ అనే వ్యక్తి కరోనాను జయించి ఆరోగ్యంగా ఉండడంతో ఎంతో మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.

రామానంద తీర్థ(110) కీసరలోని ఓ ఆశ్రమంలో ఉంటున్నారు. ఇటీవల ఆయనకు స్వల్ప కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. వైద్యుల సూచనల మేరకు ఏప్రిల్ 24న గాంధీ ఆస్పత్రిలో చేరిన రామానందతీర్థకు ఆక్సిజన్ స్థాయిలు 92 గా ఉండడంతో అతనికి ఐసియు వార్డులో కోవిడ్ చికిత్స అందించారు. దాదాపు మూడు వారాల చికిత్స అనంతరం రామానందతీర్థకి మరోసారి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అతనికి నెగిటివ్ వచ్చింది.

110 ఏళ్ల వయసులో కరోనా బారినపడి విజయవంతంగా కరోనా నుంచి బయటపడిన రామతీర్థ కి ఇతర ఎటువంటి జబ్బులు లేకపోవడంతోనే అతను తొందరగా కరోనా నుంచి కోలుకొని బయటపడినట్లు
గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago