Categories: FeaturedGeneral News

మహిళ వలపు వలలో చిక్కిన యువకుడు.. చివరకు ఏం జరిగిందంటే..!

దొంగలు కూడా స్మార్ట్ గా దొంగిలించడానికి ఇష్టపడుతున్నారు. ఎక్కడ చూసినా సీసీ ఫుటేజీల కారణంగా వెంటనే దొరికిపోతున్నామని.. వాళ్లు కూడా అప్ డేట్ అయ్యారు. ఇలా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అమ్మాయిలని ఎర వేసి.. సమస్తం దోచుకెళ్తున్నారు. ఇలానే ఓ వక్తిని నిలువునా ముంచేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేపీహెచ్ బీ కాలనీకి చెందిన శ్రీధర్ భద్రాచలం వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.

ఈ నేపథ్యంలోనే మెట్రో స్టేషన్ కి వెళ్లి అక్కడ నుంచి ఎంజీబీఎస్ వెళ్లి అక్కడ నుంచి బస్సులో వెళ్లాలనుకున్నాడు. కానీ కేపీహెచ్ బీ మెట్రో స్టేషన్ లో విజయ అనే ఓ యువతి అతడికి తారసపడింది. శ్రీధర్ కు మాయమాటలు చెప్పి తన ప్రయాణాన్ని వాయిదా వేసుకునేలా చేసింది.

చివరకు అతడు ఆమెతో వెళ్లే విధంగా చేసింది. ఇద్దరు కలిసి అక్కడ నుంచి ఓ ఆటోలో వెళ్లారు. అతడిని ఓ నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లింది ఆ యువతి. అప్పటికే అక్కడ తన స్నేహితులు జోగేందర్ సింగ్, ముత్యాల విష్ణులు ఉన్నారు. శ్రీధర్ రాగానే అతడిపై దాడి చేయడం మొదలు పెట్టారు. దీంతో అతడు ప్రతిఘటించగా కోపంతో వాళ్లిద్దరు అతడిని గాయపరిచి ఫోన్, వాచ్, పర్సు, డబ్బులను తీసుకొని పారిపోయారు.

అక్కడ నుంచి అతడు భద్రాచలం వెళ్లి స్నేహితుడికి ఫోన్ చేశాడు. జరిగిన విషయం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పాడు. అతడు జగద్గిరి గుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. విచారణలో భాగంగా రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముగ్గరుని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 10 గ్రాముల బంగారం, రెండు బైక్ లను స్వాధీనం చేసుకొని నిందితులును రిమాండ్ కు తరలించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

చక్రి మరణంపై షాకింగ్ నిజాలు.. రఘు కుంచె క్లారిటీ

దివంగత సంగీత దర్శకుడు చక్రి మరణంపై ఎన్నాళ్లుగానో వినిపిస్తున్న పుకార్లకు తెరదించిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ గాయకుడు,…

6 minutes ago

ఇలా కూర్చుంటే రక్తపోటు పెరుగుతుందా? షాకింగ్ ఫ్యాక్ట్!

ఇటీవల జీవనశైలిలో మార్పులతో పాటు కూర్చునే విధానాలపై కూడా ఆరోగ్య నిపుణులు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా కాళ్లు మడిచుకుని ఎక్కువసేపు…

18 minutes ago

దేవుడికి నమస్కారం చేస్తే ఎందుకు కళ్లు మూసుకుంటాం? అసలు కారణం ఇదే!

దేవాలయంలోనూ, ఇంట్లోనూ ప్రార్థన చేసే సమయంలో చాలా మంది సహజంగా కళ్లు మూసుకుని చేతులు జోడిస్తారు. ఇది కేవలం అలవాటు…

48 minutes ago

తెలంగాణలో ఎవరి జనాభా ఎక్కువ?.. కుటుంబ సర్వేలో బిగ్ రివీల్

తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…

1 hour ago

అమావాస్య వెనుక ఉన్న పురాణ కథ తెలుసుకుంటే ఆశ్చర్యమే!

ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి గురించి సాధారణంగా చాలా మందిలో అశుభ భావన ఉంది. ముఖ్య పనులు, శుభకార్యాలు…

1 hour ago

అంతర్జాతీయ విజయాల కోసం తిరుమల చేరుకున్న పీవీ సింధు!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…

2 hours ago