దొంగలు కూడా స్మార్ట్ గా దొంగిలించడానికి ఇష్టపడుతున్నారు. ఎక్కడ చూసినా సీసీ ఫుటేజీల కారణంగా వెంటనే దొరికిపోతున్నామని.. వాళ్లు కూడా అప్ డేట్ అయ్యారు. ఇలా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అమ్మాయిలని ఎర వేసి.. సమస్తం దోచుకెళ్తున్నారు. ఇలానే ఓ వక్తిని నిలువునా ముంచేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేపీహెచ్ బీ కాలనీకి చెందిన శ్రీధర్ భద్రాచలం వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.

ఈ నేపథ్యంలోనే మెట్రో స్టేషన్ కి వెళ్లి అక్కడ నుంచి ఎంజీబీఎస్ వెళ్లి అక్కడ నుంచి బస్సులో వెళ్లాలనుకున్నాడు. కానీ కేపీహెచ్ బీ మెట్రో స్టేషన్ లో విజయ అనే ఓ యువతి అతడికి తారసపడింది. శ్రీధర్ కు మాయమాటలు చెప్పి తన ప్రయాణాన్ని వాయిదా వేసుకునేలా చేసింది.
చివరకు అతడు ఆమెతో వెళ్లే విధంగా చేసింది. ఇద్దరు కలిసి అక్కడ నుంచి ఓ ఆటోలో వెళ్లారు. అతడిని ఓ నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లింది ఆ యువతి. అప్పటికే అక్కడ తన స్నేహితులు జోగేందర్ సింగ్, ముత్యాల విష్ణులు ఉన్నారు. శ్రీధర్ రాగానే అతడిపై దాడి చేయడం మొదలు పెట్టారు. దీంతో అతడు ప్రతిఘటించగా కోపంతో వాళ్లిద్దరు అతడిని గాయపరిచి ఫోన్, వాచ్, పర్సు, డబ్బులను తీసుకొని పారిపోయారు.
అక్కడ నుంచి అతడు భద్రాచలం వెళ్లి స్నేహితుడికి ఫోన్ చేశాడు. జరిగిన విషయం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పాడు. అతడు జగద్గిరి గుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. విచారణలో భాగంగా రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముగ్గరుని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 10 గ్రాముల బంగారం, రెండు బైక్ లను స్వాధీనం చేసుకొని నిందితులును రిమాండ్ కు తరలించారు.




























