హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఏటీఎం సెంటర్ దగ్గర తుపాకీ కాల్పులు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నిందితులు కాల్పులు జరిపి ఏటీఎం లోని నగదును దోచుకెళ్లారు. అయితే ఈ ఘటన జరిగిన కొద్ది గంటలలోనే పోలీసులు నిందితులను పట్టుకున్నారు.నిందితులు నాదెండ్ పారిపోతుండగా సంగారెడ్డిలో ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ తుపాకీ ఫైరింగ్ కేసును కేవలం గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించి నిందితులను పట్టుకోగలిగారు. ఈ కాల్పులు జరిపినది పాత నిందితులేనని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. 15 రోజుల క్రితం జీడిమెట్లలో జరిగిన దోపిడీ కేసులో కూడా వీళ్ళకు సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.జీడిమెట్లలో ఓ సేల్ షాప్ యజమానికి తుపాకీతో బెదిరించి లక్ష రూపాయల నగదుతో పాటు సెల్ ఫోన్లు తీసుకెళ్లి పోయారు.అయితే ఈ కేసులో నిందితుల కోసం గాలిస్తున్న క్రమంలోనే కూకట్ పల్లి ఘటన జరిగింది.
జీడిమెట్ల నిందితులే కూకట్ పల్లిలోని ఏటీఎం సెంటర్లో మళ్లీ ఇలా కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.ఈ విధంగా రెండు చోట్ల దోపిడీలకు, కాల్పులకు పాల్పడింది ఒకరేనని నిర్ధారణ చేసుకున్న పోలీసులు వారిని గాలించడం కోసం ఆరు బృందాలుగా విడిపోయారు.కూకట్ పల్లిలోని హెచ్డీఎఫ్సీ ఏటీఎం సెంటర్లో వీరు దోపిడీ చేశారు. ఈ సమయంలో అడ్డం వచ్చిన ఇద్దరి పై కాల్పులు జరపగా ఒకరు చికిత్స తీసుకుంటూ మరణించారు. ఈ క్రమంలోనే పోలీసులు దర్యాప్తు వేగంగా ప్రారంభించగా నిందితులను నాదెండ్ పరిసర ప్రాంతాలలో సంగారెడ్డి ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…