దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్కుమార్పై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేశారు. ఐపీసీ 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదయినట్టు తెలుస్తుంది. అసలు విషయం ఏమిటంటే.. బొల్లారం ప్రాంతానికి చెందిన బ్యాగరి నర్సింహులు వెంకటేష్ అనే టెక్నీషియన్ 2012 నుంచి 2016 వరకు దాసరి వద్ద మూవీ రిస్టోరేషన్ ఔట్సోర్సింగ్ పనులు చేసేవారట. అయితే ఆ సమయంలో దాసరి కుమారులు ప్రభు, అరుణ్కుమార్ ఇద్దరికీ అతను బాగా పరిచయం. ఇక నవంబర్ 15, 2018 న దాసరి నారాయణరావు మరణించిన తరువాత ఇదివరకు చేసుకున్న పాత ఒప్పందాన్ని రద్దు చేసి కొత్తగా మరో ఒప్పందం కుదుర్చుకున్నారు.
అయితే ఇటీవల డబ్బులు ఇవ్వాల్సి వచ్చిన సమయంలో దాసరి అరుణ్ డబ్బులు ఇవ్వనని అసలు తాను ఆ ఒప్పందంపై సంతకం చేయలేదని చెప్పారు. ఈ క్రమంలో ఈ నెల 13న రాత్రి తన డబ్బుల గురించి అడిగినప్పుడు ఫిలింనగర్ లోని ఎఫ్ఎన్సీసీ కి రమ్మని అరుణ్ కుమార్ చెప్పగా.. చక్రపాణి అనే ప్రత్యక్ష సాక్షిని తీసుకొని వెళ్లానని బాధితుడు చెప్పాడు.
తన డబ్బులు అడిగేందుకు వెళ్ళిన అతనిని దాసరి అరుణ్కుమార్ దూషిస్తూ.. కులం పేరుతో తనను తిట్టారని, నీ అంతు చూస్తానంటూ బెదిరించారని అయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో దాసరి అరుణ్ కుమార్ నుంచి తనకు ప్రాణహాని ఉందని బాదితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరుణ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…