ఆఫ్గనిస్థాన్లో తాలిబన్ల ఆగడాలు తారాస్థాయికి చేరాయి. దాదాపు దేశం మొత్తం స్వాధీనం చేసుకున్నారు. కొన్ని దేశాల అండదండలతో వారు ప్రభుత్వాన్ని నడిపే స్థాయికి వెళ్లిపోయారు. దీంతో అక్కడ అరాచకపాలన మొదలైంది. సైనికుడు, పౌరుడు అనేది చూడకుండా ఇష్టం వచ్చినట్లు దాడులకు పాల్పడుతున్నారు. మహిళల విషయానికి వస్తే బలవంతపు పెళ్లిలు, లైంగిక దాడులు చోటుచేసుకుంటున్నాయి.
అయితే ప్రస్తుతం ఆఫ్గనిస్థాన్లో జరుగుతోన్న పరిమాణాలపై ప్రతీ ఒక్కరు చర్చించుకుంటున్నారు. అమెరికా సైన్యాలు ఆఫ్గన్ను వీడడంతో తాలిబన్లు రెచ్చిపోయారు. ఇక అక్కడ చిక్కుకున్న విదేశియలు వారితో పాటు స్వదేశీయులు కూడా దేశాన్ని విడిచి వెళ్లేందుకు ఏ చిన్న అకకాశం దొరికినా ఉపయోగించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే కాబూల్ నగరంలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి విదేశాలకు వెళుతోన్న విమానాల రెక్కలపై వేలాడుతూ వెళుతోన్న దృశ్యాలు యావత్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంటున్నాయి. ఇదిలా ఉంటే సుమారు 20 ఏళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్న తాలిబన్లు మళ్లీ అధ్యక్ష పీఠాన్ని హస్తగతం చేసుకోవడంతో రచ్చ చేస్తున్నారు. అధ్యక్ష భవనంలో వారు చేస్తున్న హంగామా అంతాఇంతా కారు. అయితే టాలీవుడ్ లో కాట్రవర్సీటీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ తాలిబన్ల వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించారు.
తాలిబన్లు అధ్యక్ష భవనంలో చేతిలో ఆయుధాలు పట్టుకొని జాల్సాలు చేస్తున్న తాలిబన్లకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ.. ‘వాళ్లు ఎలాంటి జంతువులనేది ఇది చూస్తేనే అర్థమవుతుందని’ క్యాప్షన్ రాసుకొచ్చారు. అక్కడ ప్రతీ ప్రాంతాన్ని తమ హస్తగతం చేసుకున్న తాలిబన్లు కాబుల్ లోని ఓ ఎమ్యూజ్ మెంట్ పార్కులో ఎలక్ట్రిక్ కార్లలో కూర్చొని చిన్న పిల్లలులాగా ఆడారు. ఆ వీడియోను ఆర్జీవీ షేర్ చేస్తూ.. ఇది నిజమే.. తాలిబన్లు చిన్ని పిల్లలు అంటూ స్పందించారు. అయితే ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. నెటిజన్లు కూడా పాజిటివ్ గా స్పందించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…