Hyper Aadi:వెండితెర నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూర్ణ బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోని తాజాగా ఈమె శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి జడ్జిగా వచ్చారు. ఇక ఈ కార్యక్రమానికి తీస్ మార్ ఖాన్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హీరో ఆది సాయికుమార్, నటి పాయల్ రాజ్ పుత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తాజాగా విడుదలైన ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆది పెద్ద ఎత్తున సందడి చేసినట్లు తెలుస్తోంది.
ఎప్పటిలాగే ఆది తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేస్తూ అందరిని సందడి చేశారు ఈ క్రమంలోనే ఆది హీరో ఆది సాయికుమార్ తో మాట్లాడుతూ ఉండగా.. మధ్యలో పూర్ణ జోక్యం చేసుకొని హైపర్ ఆది ఫ్లర్ట్ చేస్తున్నారు. హీరో ఆది చాలా క్వైట్ గా ఉన్నారు అంటూ ఈమె కామెంట్ చేశారు. దీంతో హైపర్ ఆది వెంటనే పూర్ణ గారు మీ హనీమూన్ బాగా జరిగిందా? అని ప్రశ్నించారు.
అందరి ముందు హైపర్ ఆది పూర్ణను హనీమూన్ గురించి అడగడంతో ఒక్కసారిగా ఆమె సిగ్గుతో తలదించుకుంది. ఇక షో టైం లో హైపర్ ఆదికి ఎవరు ఎక్కడ దొరికిన తను పంచులతో ఆట ఆడుకుంటారు అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పూర్ణను
ఇలా హనీమూన్ గురించి ప్రశ్నించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
ఇకపోతే పెళ్లి కాకుండానే హనీమూన్ ఎలా జరిగిందని అడగడం ఏంటి విడ్డూరంగా అంటూ పలువురు ఈ వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు. అయితే పూర్ణ ప్రముఖ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరుపుకుందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు.ఇలా తన పెళ్లి జరుగుతుందన్న నేపథ్యంలోనే హైపర్ ఆది తన హనీమూన్ గురించి ప్రశ్నించారు. దీంతో నేటిజన్లు యధావిధిగా హైపర్ ఆది వ్యాఖ్యలపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…
తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…
ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…