Hyper Aadi: కమెడియన్ హైపర్ ఆది తాజాగా మరో జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ హీరోగా నిర్మాతగా చేసిన కేశవ చంద్ర రమావత్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు. ఈ సినిమా ఈనెల 22వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఒక జబర్దస్త్ కమెడియన్ గా తన ప్రయాణం మొదలుపెట్టిన రాకింగ్ రాకేష్ ఇలా సినిమాలలో హీరోగా నటిస్తూ ఆ సినిమాని ఆయనే స్వయంగా నిర్మించటం విశేషం.
ఇక ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ ఈనెల 22వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకకు తన తోటి జబర్దస్త్ కమెడియన్స్ అలాగే బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ మంత్రి ఆర్కే రోజా హాజరయ్యారు. అలాగే హైపర్ ఆది కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది రోజా గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా రోజుల తర్వాత రోజా గారిని ఇలా ఈ వేదికపై కలవడం సంతోషంగా ఉందని తెలిపారు.. ఇకపోతే ఇటీవల రాజకీయాల పరంగా రోజా గారిని హైపర్ ఆది ఏమన్నారో తెలుసా అంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వారి వ్యూస్ కోసం ఎన్నో వార్తలను రాశారు.
ఈరోజు నేను ఇక్కడ చెబుతున్న నేను ఇంతవరకు రోజా గారిని ఎప్పుడు ఎక్కడ కూడా చెడుగా మాట్లాడలేదని, తన గురించి అలా ఎప్పటికీ మాట్లాడనని హైపర్ ఆది తెలిపారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ఇండస్ట్రీ చాలా బాగుందని వెల్లడించారు. పుష్ప సినిమా త్వరలోనే రాబోతోంది ఇక ఆస్కార్ అవార్డు రావడం ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్ల సినిమాలలో నటించడం. పవన్ కళ్యాణ్ పొలిటికల్ పరంగా 100% నటించడంతో తెలుగు చిత్ర పరిశ్రమ చాలా అద్భుతంగా ఉంది అంటూ హైపర్ ఆది ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…