Hyper Adhi : ఈటీవీలో ప్రసారమయ్యే షోలలో జబర్దస్త్ తరవాత అంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్న షో శ్రీదేవి డ్రామా కంపెనీ. ప్రతివారం ఒక కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తున్న ఈ షోలో సెలబ్రిటీలు, జబర్దస్త్ వాళ్ళు చేసే సందడి మామూలుగా ఉండదు. ఈవారం శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో ను ఈటీవీ వాళ్ళు విడుదల చేసారు. తెలంగాణ లో ప్రస్తుతం జరుగుతున్న బోనాల పండగ కాన్సెప్ట్ తో ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ ఉండబోతోంది. ప్రస్తుతం తెలంగాణ అంతా బోనాల జాతరతో మునిగితేలుతుండడం తో ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా బోనాల జాతర చేసారు.
ఆది కి వార్నింగ్ ఇచ్చిన కనకవ్వ…
ఎప్పటిలాగే షోలో సెలబ్రిటీలు కూడా సందడి చేసారు. కార్తికేయ సినిమా రెండో భాగం విడుదల సందర్బంగా నిఖిల్, అనుపమ ఆ సినిమా ప్రొమోషన్స్ కోసం శ్రీదేవి డ్రామా కంపెనీ కి వచ్చారు. ఇక అనుపమ బావ బోనాల జాతరలో తప్పిపోయాడంటూ స్కిట్స్ చేయడం ఇమ్మానుయేల్ నేనే ఆ బావని అంటూ రావడం నవ్వు తెప్పిస్తాయి. ఇక అనుపమ తన సింగింగ్ టాలెంట్ తో శతమానం భవతి సినిమాలోని పాటతో ఆకట్టుకుంది.
ఇక బాలయ్య, పవన్ కళ్యాణ్ డూపులతో డాన్సులు వంటివి ఆకట్టుకున్నాయి. ఇక ప్రోమో చివర్లో అమ్మవారి గా బుల్లితెర నటి హావభవాలు గూస్ బంప్స్ తెప్పించాయి. ఇక రష్మీ ఆది వద్దకు వెళ్లి నువ్వు కనకవ్వ డాన్స్ చేసారు కదా ఎలా అనిపించింది అని అడుగగా ఆది కనకవ్వ చేతిలో చేయి వేసి కళ్ళతో సైగ చేస్తుంటే కనకవ్వ నాలుక మడతపెట్టి వార్నింగ్ ఇచ్చినట్లుగా చేస్తుంది. దీనితో ఒక్క సారిగా అందరూ షాక్ అయ్యారు ఆతరువాత నవ్వేశారు. నర్సాపెల్లి అంటూ పాట పాడీ మంచి గుర్తింపు పొందిన తెలంగాణ జానపద కళాకారిణి కనకవ్వ. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఆమె సందడి చేయడం అందరినీ ఆకట్టుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…