నందమూరి బాలకృష్ణ గురించి ఇండస్ట్రీలో చాలా మంచి అభిప్రాయం ఉంది. అతన్ని దగ్గర నుంచి గమనించిన వారు బాలకృష్ణ వ్యక్తిత్వానికి ఫిదా అవుతుంటారు. తన మనసులో ఏం అనిపిస్తే అదే చేస్తారు బాలకృష్ణ. డైరెక్టర్ల హీరో అంటూ బాలకృష్ణకు మంచి పేరుంది. తన సినిమాలో డైరెక్టర్ ఏం చేయమంటే అదే చేస్తారు బాలయ్య. తనకు కోపం వచ్చినా.. సంతోషం వచ్చినా ఆపుకోలేరు బాలకృష్ణ.
ఇదిలా ఉంటే తాజాగా అఖండ హిట్ ఇచ్చిన కిక్ బాలకృష్ణలో కనిపిస్తోంది. ముఖ్యంగా ఆహాలో అన్ స్టాపబుల్ ప్రోగ్రాం ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలుసు. ఆ షోలో బాలకృష్ణ ఎనర్జీ లెవల్స్ పీక్స్ లో ఉంటున్నాయి. గెస్ట్ లుగా వచ్చినవారు బాలయ్య బాబు సందడి చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. ముందుగా మోహన్ బాబుతో మొదలైన ఈ అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే మొదటి ఎపిసోడ్ తోనే చాలా పెద్ద హిట్ టాక్ తెచ్చకుంది.
తర్వాత ఈ టాక్ షోకి నానీ వచ్చి సందడి చేశాడు. ఇక తాజాగా డిసెంబర్ 31న విడుదల చేయనున్న మరో ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో విడుదల అయింది. దీనిలో బాలయ్యతో రవితేజ కనిపించాడు. అంతే కాదు అతడితో పాటు గోపీచంద్ మలినేని కూడా హాజరయ్యాడు. ఇక రవితేజకు మొదల వెల్ కమ్ చెబూత.. మనం ఒక క్లారిటీ తీసుకోవాలి.. నీను నాకు పెద్ద గొడవైందట నిజమేనా.. అని అడగ్గా.. పనీ పాట లేని వాళ్లు చెప్పే మాటలు అని సమాధానమిస్తాడు. ఇక తర్వాత మొగల్ రాజ్ పురం అమ్మాయిలకు బాగానే లైన్ వేసేవాడివంట కదా.. అడి అడగ్గా.. దానికి బాలయ్య.. ఈ విషయాలన్నీ మీకు ఎవరు చెప్పారు సార్.. అంటూ బిడియంతో ఊగిపోయాడు రవితేజ.
అయితే దీంట్లో తప్పేందయ్యా.. మీము కూడా వేశాం అంటూ బాలయ్య అంటాడు. ఇవన్నీ ఎవరు ఇచ్చారు అని అడగ్గా.. మాది కృష్ణా జిల్లాయే బాసూ..తాను చిన్నపుడు అమ్మాయిలకు లైన్ వేసేవాడిని. కాలేజ్లో అమ్మాయిలకు అంటూ ఆ రోజులను గుర్తు చేసుకుంటూ నవ్వుకున్నారు. ఇక నీకొడుకు నీకంటే టాలెంటెడ్ అంటగా.. అనగా.. అందుకే అతడిని తాను DNK అని పేరు పెట్టానని.. DNK అంటే దొంగ నా కొడుకు అని రవితేజ చెప్పడంతో ఇద్దరూ నవ్వుకున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదలకు సిద్ధమైంది. గత…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ రంగంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో "కొరియన్ స్కిన్కేర్" ఒకటి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై…
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…