Raghu Kunche: టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా, ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వారిలో రఘు కుంచే ఒకరు. ఈయన మ్యూజిక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఎన్నో సినిమాలు మంచి మ్యూజికల్ హిట్ అందుకున్నాయి. ఇలా తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన పలాస చిత్రంలోని పాటలు సైతం ప్రేక్షకులను బాగా సందడి చేశాయి.
తాజాగా రఘు కుంచే ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరియర్లో జరిగిన పలు సంఘటనల గురించి వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈయనకు పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా యాంకర్ మాట్లాడుతూ రఘు కుంచె చేసిన సినిమాలన్నీ కూడా చాలా మంచి విజయాలను అందుకున్నాయి. అయితే ఆ తర్వాత కాంబినేషన్ లో మీ స్థానంలో వేరే వాళ్ళు ఉంటారు ఎందుకు అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు రఘు కుంచే సమాధానం చెబుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆయన రవితేజతో చేసిన దేవుడు చేసిన మనుషులు సినిమా మ్యూజికల్ గా చాలా మంచి హిట్ అయ్యింది. ఎన్నోసార్లు రవితేజ చాలా మంచి మ్యూజిక్, సాంగ్స్ అందించారని చెబుతుంటారు. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయింది. సినిమా ఫ్లాప్ అవ్వడానికి తాను కారణం కాదని రఘు వెల్లడించారు.
ఇక ఈ సినిమా మంచి హిట్ అవడంతో రవితేజను తర్వాత సినిమా అవకాశం తనకు ఇవ్వమని అడిగాను. ఇప్పటివరకు తనకు అవకాశం ఇవ్వలేదని తెలిపారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శక నిర్మాతలు సినిమా కోసం చాలా కష్ట పడతారని చెబుతారు కానీ అవకాశాలు మాత్రం ఇవ్వరని తెలిపారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు అందరికీ నచ్చాలని ఏముండదు ఒక వ్యక్తి కొందరికి నచ్చుతారు మరికొందరికి నచ్చరు. అయితే ఇలా ఎందుకు నచ్చుతారు ఎందుకు నచ్చరనేదానికి ప్రాపర్ లాజిక్ ఉండదు అంటూ ఈ సందర్భంగా రఘు కుంచె తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…