ప్రొడక్షన్కు సంబంధించి వేరే వాళ్లకు అగ్రిమెంట్ అయిన తర్వాత అడ్వాన్స్ తిరిగి ఇవ్వడం అనేది ఒక రెండు, మూడు సినిమాలకు జరిగిందని ప్రముఖ నటి సుధ తెలిపారు. అలాంటి వాటిలో ఒకటి నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి గారికి తానింకా అడ్వాన్స్ ఇవ్వాల్సి ఉందని ఆమె స్పష్టం చేశారు. ఆయన ఒక క్యారెక్టర్ కోసం తనకు చెప్పినపుడు ఒక యాక్టర్కు ఉన్న ప్రాబ్లమ్ వల్ల ఒక ఇష్యూ అయిందని ఆమె తెలిపారు.
ఆ యాక్టర్ పేరు తాను చెప్పనన్న సుధ, ఆవిడకు మదర్ క్యారెక్టర్ చేయమని తనను అడిగినట్టు ఆమె వివరించారు. ఇప్పటివరకు చాలా మంది అగ్ర హీరోలకు మదర్గా నటించాను. అలా వాళ్లకు మదర్గా నటించానని చెప్పినపుడు ఒక రెప్యుటేషన్ ఉండేది. కానీ ఈ ఆర్టిస్ట్కు మదర్గా చేశానంటే మాత్రం తాను చెప్పుకోలేనని ఆమె చెప్పినట్టు సుధ స్పష్టం చేశారు.
లేదంటే మా ఇద్దరినీ పిలిపించి అడగండి. ఆవిడ ఒప్పుకుంటానంటే తాను మదర్ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకుంటానని ఆమె అన్నట్టు వివరించారు. ఒక వేళ ఆమె ఒప్పుకోకపోతే ఎవరు చేసింది ఒప్పో తెలుస్తుంది అని వారు అన్నట్టు ఆమె తెలిపారు. ఆ తర్వాత వాళ్లు ఏదో మాట్లాడుతూ ఆ ఆర్టిస్ట్ను అడిగారట. మీ క్యారెక్టర్ తనకిచ్చి, మదర్ క్యారెక్టర్ను సుధ గారికి ఇద్దామనుకుంటున్నాం. ఏమంటారు అని అన్నారట. అప్పుడు తను ఆవిడ నాకు మదరా ? అలాగైతే నేను ఆ సినిమానే చేయనండి అన్నారట. అలా ఆ క్యారెక్టర్ చేయకుండా అలానే మిగిలిపోయిందని, ఆ అడ్వాన్స్ కూడా అలానే ఉందని సుధ స్పష్టం చేశారు. అది ఏదో ఒక రోజు వారికి ఇచ్చేస్తానని కూడా ఆమె చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత కూడా ఆ అడ్వాన్స్ పంపిస్తానని అన్నా, ఆయన మాత్రం మీ దగ్గరే ఉంచండి. మళ్లీ ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరం వస్తుందని ఆయన అన్నట్టు ఆమె వివరించారు. ఒక వేళ ఆ ఆర్టిస్ట్కి గనక మదర్గా చేసి ఉంటే అందరూ తనను ఆమెకు మదర్ క్యారెక్టర్ ఎందుకు చేశావు అని అడుగుతారని సుధ అన్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…