Balakrishna: బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమం ఎంత మంచి ఆదరణ పొందిందో మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ఇప్పటికే రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని మూడవ సీజన్ కూడా ప్రసారమవుతుంది. ఇప్పటికే ఈ సీజన్లో రెండు ఎపిసోడ్లు పూర్తి అయ్యాయి. మూడవ ఎపిసోడ్ కి సంబంధించినటువంటి ప్రోమో ఇటీవల విడుదలైంది.
ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి సీనియర్ నటి సుహాసిని అలాగే శ్రీయ డైరెక్టర్ హరీష్ శంకర్ తో పాటు జయంతి సి పరాంజీ కూడా హాజరయ్యారని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమంలోకి వీరందరూ ఎంట్రీ ఇవ్వగానే బాలకృష్ణ గారికి వెల్కమ్ చెప్పడమే కాకుండా సుహాసినితో తనకున్నటువంటి అనుబంధం గురించి తెలియజేశారు.
ఇక వీరిద్దరూ కలిసి పలు సూపర్ హిట్ సినిమాలలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ నాకు సుహాసినికి జన్మజన్మల అనుబంధం ఉందని తెలియజేశారు. ఇక శ్రియతో నాకు మిలీనియం బంధం ఉంది అంటూ బాలయ్య ఈ సందర్భంగా తెలిపారు. సుహాసిని బాలకృష్ణ గారి గురించి మాట్లాడుతూ అప్పట్లో బాలకృష్ణ గారు ఎంతో సిగ్గుపడేవారు అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీయ గట్టిగా అరిచేశారు.
పాత కక్షలు ఉన్నాయి…
వెంటనే హరీష్ శంకర్ మీరు చెప్పే మాటలు నమ్మశక్యంగా లేవు అనడంతో వెంటనే బాలయ్య నువ్వు అసలు మాట్లాడుకు నువ్వు ఒక పక్కన కూర్చో అంటూ చెప్పారు. దీంతో జయంత్ ఎందుకలా అని ప్రశ్నించడంతో బాలయ్య మాట్లాడుతూ ఆయనతో నాకు పాత కక్షలు చాలా ఉన్నాయని బాలయ్య చెప్పటం గమనార్హం. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రోమో వైరల్ గా మారింది.
సినీ రంగంలో సాధారణంగా ఒక హీరో, కొన్ని ఎంపిక చేసిన హీరోయిన్లతోనే ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. ముఖ్యంగా గత కాలంలో…
దక్షిణ భారతీయుల రోజువారీ ఆహారంలో ఇడ్లీ, దోశలకు ప్రత్యేక స్థానం ఉంది. వేగవంతమైన జీవనశైలిలో సమయం ఆదా కోసం చాలామంది…
మధుమేహం (డయాబెటిస్) వల్ల వచ్చే సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలంగా షుగర్ నియంత్రణలో లేకపోతే నరాలపై ప్రభావం పడే…
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…