Balakrishna: బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమం ఎంత మంచి ఆదరణ పొందిందో మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ఇప్పటికే రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని మూడవ సీజన్ కూడా ప్రసారమవుతుంది. ఇప్పటికే ఈ సీజన్లో రెండు ఎపిసోడ్లు పూర్తి అయ్యాయి. మూడవ ఎపిసోడ్ కి సంబంధించినటువంటి ప్రోమో ఇటీవల విడుదలైంది.
ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి సీనియర్ నటి సుహాసిని అలాగే శ్రీయ డైరెక్టర్ హరీష్ శంకర్ తో పాటు జయంతి సి పరాంజీ కూడా హాజరయ్యారని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమంలోకి వీరందరూ ఎంట్రీ ఇవ్వగానే బాలకృష్ణ గారికి వెల్కమ్ చెప్పడమే కాకుండా సుహాసినితో తనకున్నటువంటి అనుబంధం గురించి తెలియజేశారు.
ఇక వీరిద్దరూ కలిసి పలు సూపర్ హిట్ సినిమాలలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ నాకు సుహాసినికి జన్మజన్మల అనుబంధం ఉందని తెలియజేశారు. ఇక శ్రియతో నాకు మిలీనియం బంధం ఉంది అంటూ బాలయ్య ఈ సందర్భంగా తెలిపారు. సుహాసిని బాలకృష్ణ గారి గురించి మాట్లాడుతూ అప్పట్లో బాలకృష్ణ గారు ఎంతో సిగ్గుపడేవారు అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీయ గట్టిగా అరిచేశారు.
పాత కక్షలు ఉన్నాయి…
వెంటనే హరీష్ శంకర్ మీరు చెప్పే మాటలు నమ్మశక్యంగా లేవు అనడంతో వెంటనే బాలయ్య నువ్వు అసలు మాట్లాడుకు నువ్వు ఒక పక్కన కూర్చో అంటూ చెప్పారు. దీంతో జయంత్ ఎందుకలా అని ప్రశ్నించడంతో బాలయ్య మాట్లాడుతూ ఆయనతో నాకు పాత కక్షలు చాలా ఉన్నాయని బాలయ్య చెప్పటం గమనార్హం. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రోమో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…