Actress Archana: టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి నటిగా గుర్తింపు పొందిన అర్చన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె పలు సినిమాలలో నటిగా, హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలలో నటించి మెప్పించారు. ఈ విధంగా పలు సినిమాలలో నటించిన అర్చన ఈమధ్య కాలంలో వెండితెరపై కనిపించలేదు. ఇకపోతే కార్యక్రమంలో పాల్గొన్న ఈమె తన కెరియర్ గురించి కెరియర్ లో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించారు.
సాధారణంగా ఒక సినిమాలో మన నటనని చూసి మనకు సినిమా అవకాశాలు వస్తాయని అలాగే అవకాశాలు కూడా పోతాయని అర్చన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే త్రిష నటించిన సినిమా వల్ల తాను ఎంతో నష్టపోయానని ఈ సందర్భంగా ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.త్రిష హీరోయిన్ గా నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో తాను త్రిష ఫ్రెండ్ పాత్రలో నటించాను అయితే ఈ పాత్ర కోసం ఏకంగా తాను బాపు గారి సినిమాలో నటించే అవకాశాన్ని కోల్పోయానని అర్చన పేర్కొన్నారు.
నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో హీరోయిన్ పాత్ర అనుకొని బాపు గారి సినిమాను పక్కనపెట్టి తప్పు చేశానని ఈమె ఎమోషనల్ అయ్యారు. ఇక శ్రీరామదాసు సినిమాలో సీత పాత్ర ద్వారా అర్చన సందడి చేశారు. ఆ సమయంలో రాఘవేంద్రరావు గారు నాగార్జున గారు తనని ఎంతో బాగా చూసుకున్నారని ఈమె వెల్లడించారు.
ఇకపోతే సామాన్యుడు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి కూడా ఈ సందర్భంగా బయటపెట్టారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక ఆర్టిస్ట్ సరదాగా ఆమె దగ్గరికి వచ్చి గన్ షూట్ చేశారు. ఆ శబ్దానికి తన చెవిలో గుయ్ మనే శబ్దం కొన్ని రోజుల పాటు తనని వేధించిందని ఆ ఘటనతో ఇప్పటికి తను చెవి సమస్యతో బాధపడుతున్నానని అర్చన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇకపోతే తనకు సరైన కథ ఉన్న పాత్రలు దొరికితే తప్పకుండా ఇస్తానని ఈ సందర్భంగా ఈమె పేర్కొన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…