Featured

Krishna Vamsi : ఖడ్గం సినిమా ఇప్పడు తీస్తే చంపేస్తారేమో… డైరెక్టర్ కృష్ణ వంశీ షాకింగ్ కామెంట్స్..!

Krishna Vamsi : రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా సినిమా ఇండస్ట్రీ లో డైరెక్టర్ గా తొలి అడుగులేసిన కృష్ణ వంశీ గులాబీ సినిమాతో డైరెక్టర్ గా మొదలుపెట్టాడు. ఆ సినిమాతో మంచి హిట్ అందుకున్న కృష్ణ వంశీ నిన్నే పెళ్లాడతా సినిమాను నాగార్జున తో చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తరువాత తీసిన సింధూరం సినిమాతో అవార్డులు అందుకున్నారు. ఇక ఆయన తీసిన అంతఃపురం సినిమా మంచి హిట్ అయి హిందీ లో కూడా ఆయనే మళ్ళీ తీశారు. హీరోయిన్ రమ్య కృష్ణ ను వివాహం చేసుకున్న ఆయన ఈ మధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చారు.

ఇప్పుడు ఖడ్గం సినిమా తీస్తే చంపుతారేమో…

2002 లో కృష్ణ వంశీ గారు తీసిన ఖడ్గం సినిమా అప్పట్లో ఒక సంచలనం. ఆ సినిమాల్లో పాతబస్తీలో తీవ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నారు అన్నట్లుగా చూపించడం, సున్నితమైన విషయాలను చూపించడంతో ఈ సినిమాను ఆపేయాలని అభ్యంతరాలు వచ్చాయి. ఇక ఈ సినిమా విడుదల అయ్యాక కూడా చాలా థియేటర్ల వద్ద గొడవలు జరిగాయి. ఇక సినిమా అయ్యాక కృష్ణ వంశీ కొంత కాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని అప్పట్లో పుకార్లు కూడా వచ్చాయి.

కానీ ఆ సినిమా ఇప్పటికి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అలాంటి సినిమా మళ్ళీ కృష్ణ వంశీ నుండి వస్తుందా అని ఒక నెటిజెన్ అడగడంతో కృష్ణ వంశీ నవ్వుతూ ఈ పరిస్థితుల్లో ఖడ్గం లాంటి సినిమా తీస్తే చంపేస్తారేమో అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అలా అనుండొచ్చు. ఇక కృష్ణ వంశీ ప్రస్తుతం ‘రంగ మార్తాండా’ సినిమాను చేస్తున్నారు . రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు నటించారు. ఇప్పటికే సినిమా చూసిన ప్రముఖులు సినిమా బాగుందని ప్రశంసించారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago