Samantha: ‘ఏ మాయ చేశావే’ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత.. ఇండస్ట్రీని మాయ చేసింది. ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా మారింది. వరసగా ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో నటించింది. టాలీవుడ్ తో పాటే కాకుండా కోలీవుడ్ లో కూడా తలపతి విజయ్, సూర్య, శివకార్తికేయన్ వంటి స్టార్ హీరోలతో ఆడిపాడింది. యంగ్ హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు.
విడాకులు తీసుకున్న తరువాత తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిన సమంత ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది.విడాకుల అనంతరం నుంచి సమంత మరింత జోరుగా సినిమాలు చేస్తోంది. సమంత చేసిని ఊ అంటావా మావా.. ఊఊ అంటావా పాట రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప సినిమా విడుదల కాకముందే పాట పెద్ద సక్సెస్ అయింది.
సమంత గ్లామర్, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మ్యాజిక్ కలిసి దేశ వ్యాప్తంగా ఈ ఐటెం సాంగ్ మారుమోగింది. ప్రస్తుతం ఈ సినిమా తరువాత వరసపెట్టి సినిమాలకు కమిట్ అవుతోంది. గుణ శేఖర్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా సినిమా ‘ శాకుంతం’ చేస్తోంది. దీంతో పాటు తెలుగు- తమిళ భాషల్లో ‘యశోద’ సినిమాను కూడా చేస్తోంది. ఇధిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా మరో సినిమా చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే సమంత తన జీవితంలో ఉన్న చీకటి కోణం గురించి వెళ్లడించింది. కేవలం రూ. 500 కూడా పని చేశానని చెప్పుకొచ్చింది. సినిమా ఇండస్ట్రీకి రాకముందు తను ఎదురుకున్న కష్టాలను గురించి ఓ కార్యక్రమంలో వెల్లడించింది. పెద్దపెద్ద వారి ఫంక్షన్లకు గెస్ట్ లను ఆహ్వానించే అమ్మాయిగా పని చేశానంది. కేవలం ఒక పూట భోజనంలో రెండు నెలలు గడపానని గుర్తు చేసుకుంది. డబ్బులు లేక చదువు మానేశానని వెల్లడించింది. పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేద్దాం అనుకుంటే… నీకిది అవసరమా అంటూ.. కుటుంబ సభ్యులు వెనక్కి లాగే ప్రయత్నాలు చేశారని తెలిపింది
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…