Smoking: ధూమపానంతో పెరిగిపోతున్న గుండె జబ్బులు..! అధికారులు ఏమంటున్నారంటే..!
Smoking: దేశంలో గుండెజబ్బులు పెరుగుతున్నాయి. ఒకప్పుడు వయసు పైబడిన వారికి మాత్రమే గుండె జబ్బులు వస్తాయి అనుకున్నారు… కానీ ఇప్పుడు పాతికేళ్ళలోపు ఉండే యువకులు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. 2015లో భారతదేశంలో దాదాపు 6 కోట్ల 20 లక్షల మందికి గుండె సంబంధ వ్యాధులు ఉన్నాయని గుర్తించారు.
వారిలో రెండు కోట్ల 30 లక్షల మంది వయసు కేవలం 40 ఏళ్ల లోపు అని సర్వే తేల్చింది. ఈ గణాంకాలను చూస్తే గుండె జబ్బులు పెరుగుతున్నాయి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు, ధూమపానం కారణం అవుతున్నాయి. ఓ సర్వే ప్రకారం ఒక వ్యక్తి ధూమపానానికి ఏడాది పాటు దూరంగా ఉంటే గుండె జబ్బులు వచ్చే తీవ్రత దాదాపు సగానికి పడిపోతుంది.
ధూమపానం చేసే వారిని.. చేయని వారిలో పోలిస్తే కరొనరి ఆర్టెరీ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ అని అధికారులు చెబుతున్నారు. సిగరెట్ తాగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 10 నుంచి 15 శాతం మంది గుండె సంబంధిత మరణాలు సంభవిస్తున్నాయి.
ఇదొక్కటే కాకుండా బ్రెయిన్ స్ట్రోక్, రక్తం గడ్డ కట్టడం, కాళ్లలో ధమనుల వాపు వంటివి గమనిస్తున్నాం. సిగరెట్ తాగడం వల్ల గుండె కండరాలకు ఆక్సిజన్ను తీసుకెళ్లే రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటానికి కారణం అవుతుంది. దీనివల్లనే గుండెపోటు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. గుండెకు రక్షణ ఇవ్వాలంటే మన ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పాటు వ్యసనాలను దూరంగా పెట్టుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం వల్ల గుండె సంబంధ వ్యాధుల నుంచి పూర్తిగా రక్షణ పొందవచ్చు. సాల్మాన్, టూ నా, మాకెరెల్ చేపలు ఇతర సముద్ర చేపలను తరచుగా తినాలి. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరానికి చాలా అవసరం. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో కొవ్వు తగ్గుతుంది. గుండె ధమనుల్లో వాపు రాకుండా చేయాలంటే బాదం, వాల్నట్, కిస్మిస్ జీడిపప్పు ,ఖర్జూరాలు వంటివి రోజు తీసుకోవాలి. గుండెకు మేలు చేసే క్యారెట్లు, చిలగడదుంపలు అధికంగా తీసుకోవాలి. మాంసాహారం అధికంగా తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానేయాలి.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…