పనిపై బైక్ తీసుకొని బయటకు వెళ్లిన మొదలు.. ఇంటికి సురక్షితంగా వస్తామా.. లేదా అనేది ఎవరికీ తెలియదు. ప్రమాదం ఎటునుంచి వస్తుందో ఎంతమాత్రం అంచనా వేయలేము. ఇలాంటిదే అనుకోని ప్రమాదం బారిన పడ్డారు ఓ దంపతులు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర పూణేకు చెందిన వైద్యుడు జుబేర్ షేక్, అతడి భార్య కలిసి బైక్ పై ఖడ్డా మార్కెట్ ప్రాంతం నుంచి పనిపై మరో ప్రదేశానికి వెళ్తున్నారు.
అయితే ఆ ప్రాంతం అంతా ఇరుకుగా ఉంటుంది. అలా వెళ్తున్న క్రమంలో అతడికి ఎదురుగా గేదెలు కనిపించాయి. దీంతో అతడు పక్కకు బండిని ఆఫ్ చేసి చూస్తూ ఉన్నాడు. అవి దగ్గరకు వచ్చి అకస్మాత్తుగా అతడిపై కొమ్ములతో దాడి చేశాయి.
దీంతో అతడి చెయ్యి వేళ్లు విరిగిపోయాయి. తన భార్యకు చిన్న పాటి గాయాలతో బయటపడింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపు జరిగే నష్టం జరిగిపోయింది. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయమని కోరారు. దీంతో ఆ ప్రాంతంలోని సీసీఫుటేజీని పరిశీలించిన పోలీసులు ముగ్గురు వ్యక్తులు తమ గేదెలను తోలుకుంటూ రావడం గమనించారు.
ఈ ఘటన చూసి పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరుకుగా ఉన్న రోడ్డుపై పశువులను తీసుకువచ్చి.. ప్రమాదానికి కారణమయ్యారంటూ వారిని అరెస్టు చేశారు. ప్రమాదంలో గాయపడిన ఆ దంపతులకు నష్టపరిహారం చెల్లించాలని తెలిపారు. పోలీసులు అరెస్టు చేసిన వారి పేర్లు రజాక్ , సదాకత్ మరియు నదాఫత్ గా వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…