పదో తరగతి పాసైన వాళ్లకు ఇండియా పోస్ట్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. 3,446 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. https://appost.in/gdsonline/home.aspx వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో 3,446 ఖాళీలలో ఏపీలో లో 2296 ఉద్యోగ ఖాళీలు, తెలంగాణలో 1150 ఖాళీలు ఉన్నాయి.
https://appost.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి 26 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలలో బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
స్థానిక భాషపై పట్టు ఉండి ఇంగ్లీష్, గణితం సబ్జెక్టులలో ఉత్తీర్ణులైన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి సంబంధిత గ్రామ పరిధిలో తప్పనిసరిగా నివాసం ఉండాలి. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన వారికి ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
ఎలాంటి ఇంటర్వ్యూ, రాత పరీక్ష లేకుండా ఎంపికయ్యే ఉద్యోగాలు కావడంతో ఈ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగ అభ్యర్థులకు ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…