ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ది కృష్ణా డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 118 ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ పాసైన కృష్ణా జిల్లా అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://krishnadccb.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. పోస్టును బట్టి వేతనంలో మార్పులు ఉంటాయి.
మొత్తం 118 ఉద్యోగాలలో స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 72 ఉండగా అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు 28, పీఏసీఎస్ స్టాఫ్ ఉద్యోగాల కొరకు 18 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 118 ఉద్యోగ ఖాళీలలో 43 ఉద్యోగాలను మహిళలకు కేటాయించారు. స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 24 వేల రూపాయలు, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు ఎంపికైన వారు 33 వేల రూపాయలు వేతనం పొందవచ్చు.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జనవరి 31 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు ఇంగ్లిష్, తెలుగు భాషలలో ప్రొఫిషియన్సీ ఉండాలి. కృష్ణా జిల్లా అభ్యర్థులై ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
2021 సంవత్సరం జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయో సడలింపులు ఉంటాయి. ఇంటర్వ్యూ, ఆన్లైన్ టెస్ట్/ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…
తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…
ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…