Categories: FeaturedGeneral News

లాటరీలో 20 కోట్లు గెలిచాడు… కానీ ఆ డబ్బును అందుకోలేక పోతున్నాడు… కారణం అదే!

సాధారణంగా కొందరికి అదృష్టం తలుపు తడితే రాత్రికి రాత్రే కోటీశ్వరుడుగా మారిపోతుంటారు మరికొందరికి దురదృష్టం వెంటాడితే ఎన్ని కోట్లు ఉన్న రాత్రికి రాత్రే బిచ్చగాడిగా మారిపోతారు. అయితే మీరెప్పుడైనా ఒకే వ్యక్తికి అదృష్టం దురదృష్టం వెంటవెంటనే రావడం గురించి విన్నారా. అయితే ఈ కేరళకు చెందిన వ్యక్తికి జరిగిన విషయం గురించి తెలుసుకోవాల్సిందే.

కేరళకు చెందిన నహీల్ అనే వ్యక్తి గత కొంత కాలంగా దుబాయిలో నివసిస్తున్నారు. సెప్టెంబర్ 26న నహీల్ ఒక లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.ఈ టిక్కెట్ కొనుగోలు చేసే సమయంలో అతని అడ్రస్ కేరళ ఇవ్వగా అలాగే అతని ఫోన్ నెంబర్ లు రెండు ఇచ్చాడు. ఈ క్రమంలోనే లాటరీ నిర్వాహకులు ఆదివారం జరిగిన బిగ్ టికెట్ అబూదాబి సిరీస్‌ 232 లాటరీ డ్రాలో అతడు ఏకంగా 10 మిలియన్ దుబాయ్ దిర్హామ్‌లు గెలిచాడు.

మన భారత కరెన్సీ ప్రకారం అతను లాటరీలో ఏకంగా 20 కోట్ల రూపాయలను గెలుచుకున్నాడు.ఇలా 20 కోట్లను గెలుచుకున్న విషయాన్ని లాటరీ నిర్వాహకులు అతనికి తెలియ చేయాలని అతను ఇచ్చిన ఫోన్ నెంబర్లకు ఫోన్ ప్రయత్నించడంతో ఆ రెండు సెల్ నెంబర్లు పని చేయకపోవడం గమనార్హం.

ఈ క్రమంలోనే కేరళకు చెందిన నహీల్ నిజాముద్దీన్ కు తను లాటరీలో గెలిచిన 20కోట్ల విషయం తనకు ఇప్పటికీ తెలియదని ఎలాగైనా ఈ విషయాన్ని తనకు చేరవేసే వరకు మా ప్రయత్నం చేస్తూనే ఉంటానని లాటరీ నిర్వాహకులు తెలియజేశారు.దీన్ని బట్టి చూస్తే అదృష్టం దురదృష్టం రెండు తనని వెంటాడుతున్నాయని చెప్పవచ్చు.ఏదిఏమైనప్పటికీ 20 కోట్లు గెలుచుకొని తను పొందకపోవడం నిజంగానే దురదృష్టం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago