“నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను.!!
నేను సైతం విశ్వసృష్టికి అశ్రు నొక్కటి దార పోశాను.!!
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను!!”
2003 వి.వి.వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన ఠాగూర్ చిత్రంలోని ఈ పాట ఒక్కటి చాలు సుద్దాల అశోక్ తేజ అంటే ఏమిటన్నది. నిరంకుశ నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న ప్రజాకవి సుద్దాల హనుమంతు కుమారుడే మన సినీ గేయరచయిత సుద్దాల అశోక్ తేజ. నల్గొండ లో జన్మించిన సుద్దాల అశోక్ తేజ చిన్నప్పటి నుండే పాటలు రాయడం మొదలు పెట్టారు.
అలా ఉన్నత చదువులు పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా జీవితం కొనసాగించారు. తనికెళ్ల భరణి ప్రోత్సాహంతో నమస్తే అన్నా సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత దాసరి నారాయణ రావు గారి పరిచయంతో మరిన్ని అవకాశాలు పొందారు. దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో చాలా సినిమాలకు సుద్దాల అశోక్ తేజ పాటలు రాయడం జరిగింది. నిన్నే పెళ్ళాడుతా, ఒసేయ్ రాములమ్మ వంటి చిత్రాలు అశోక్ తేజకు మంచి పేరును తీసుకొచ్చాయి. మొదట విప్లవాత్మక పాటలు రాసినప్పటికీ తర్వాత కాలంలో ప్రేమ పాటలు రాయడం మొదలు పెట్టారు. దాదాపు పన్నెండు వందల చిత్రాల్లో రెండు వేలకు పైగా సినిమా పాటలు రాయడం జరిగింది. 2002 వైజయంతి మూవీస్ బ్యానర్, బి.గోపాల్ దర్శకత్వంలో చిరంజీవి, సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా ఇంద్ర సినిమా విడుదల అయ్యింది.
ఈ సినిమాకి గాను సుద్దాల అశోక్ తేజ ఒక అందమైన పాట రాశారు. “నెమలి కన్నోడ.. నమిలే చూపోడ.. కమిలిపోకుండా తాకాలయ్యో.” ఈ పాట సంగీత దర్శకునికి, సినిమా హీరోకి, నిర్మాతకి నచ్చింది కానీ దర్శకుడు బి.గోపాల్ ఇదివరకు తీసిన సినిమాల్లో అలాంటి లిరిక్స్ ఉన్నాయని ఇంద్ర సినిమాలోంచి ఆ పాటను తీసివేయడం జరిగింది. సుద్దాల అశోక్ తేజకు తెలియకుండా అలా జరగడం తో చాలా బాధపడ్డారు. తర్వాత సుద్దాల అశోక్ తేజ కు మణిశర్మ కలిసినప్పుడు మంచి పాటరాశావు తీసుకు వెళ్ళిపోయావు అని సుద్దాల అశోక్ తేజతో అన్నారు. ఆ తర్వాత ఒకసారి రాఘవేంద్ర రావు ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా తీస్తున్నప్పుడు సుద్దాల అశోక్ తేజ రాఘవేంద్రరావుకు కనబడ్డారు. నీవు రాసిన పాట ఏదైనా క్యాన్సిల్ అయిందా.. అయితే చెప్పు ఒకటో నెంబర్ కుర్రాడు లో పెట్టేద్దాం అన్నాడు. అలా రాఘవేంద్రరావుకు నచ్చడంతో ఆ పాటను ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాలో పెట్టడం జరిగింది.
మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్…
నేటి జీవనశైలిలో మార్పులు, అసమయ ఆహారం కారణంగా జీర్ణ సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ ఆహారాలకు…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్లో త్వరలో కొత్త ప్రీమియం సేవలు అందుబాటులోకి రావచ్చని సమాచారం.…
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే దానిని ఎలా వాడుతున్నామన్నది ఆరోగ్యంపై ప్రభావం…
వేసవి కాలంలో ఎండ తీవ్రత పెరిగినకొద్దీ చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులపై టానింగ్ రావడం…
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…