టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో మ్యూజికల్ హిట్స్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి.పట్నాయక్. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న సంగీత దర్శకుల్లో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈయన కేవలం సంగీత దర్శకుడు మాత్రమే కాకుండా తన నటనతో ఎంతోమందిని మెప్పించాడు కూడా. ఒకవైపు ఈ సంగీత దర్శకుడిగా కొనసాగుతూనే మరో సంగీత దర్శకుల వద్ద పాటలు పాడిన అనుభవం ఆయనకు ఉంది. అలా సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ముద్రవేసుకున్నాడు ఆయన ఒక్కసారిగా సినిమాలకు సంగీతాన్ని అందించడం పూర్తిగా మానేశాను అని ప్రకటించాడు. దీనికి ప్రధాన కారణం టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది అనుకునేది అక్కినేని నాగార్జున అని. ఈ వార్తను ఇప్పటికి టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంత మంది అంటూనే ఉంటారు.
అయితే ఈ విషయంపై ఆర్.పి.పట్నాయక్ ఎప్పుడు ఎక్కడ చర్చించడానికి ఇష్టపడలేదు. కాకపోతే, ఈ మధ్యకాలంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తాను ఈ విషయం పై పూర్తిగా క్లారిటీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఆయన అసలు తాను మ్యూజిక్ మానేయడానికి కారణం ఏంటి అని వివరించాడు. అందులో భాగంగానే తాను ఇక మ్యూజిక్ చేయకూడదని నిర్ణయించుకోవడానికి కారణం ‘ నేనున్నాను ‘ సినిమా అంటూ చెప్పుకొచ్చారు. ఆ సినిమాకు ముందుగా సంగీత దర్శకుడిగా తనని తీసుకున్నారని అందుకు సంబంధించి తాను సినిమాకు కూడా ట్యూన్స్ ఇచ్చినట్లు తెలియజేశాడు. అయితే ఆ సినిమా ఒప్పుకొన్నా సమయంలో ఆర్ పి పట్నాయక్ అమెరికా టూర్ కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆర్పి పట్నాయక్ మేనేజర్ అలాగే ‘నేనున్నాను’ సినిమా చిత్ర బృందానికి మధ్యలో జరిగిన మిస్ కమ్యూనికేషన్ కారణంగా ఆయనకు ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు. అలా ఆయన అమెరికా టూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ సినిమాకు సంబంధించి ఓ పెద్ద వ్యక్తి అంటూ పేరు ప్రస్తావించకుండా అతను తన దగ్గరికి వచ్చి నిన్ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడం వల్ల సినిమా బిజినెస్ జరగడం లేదని చెప్పడంతో తాను ఆశర్యపోయినట్లు తెలియజేశాడు.
దీంతో ఆలోచించిన తర్వాత ఆ క్షణమే ఇక మ్యూజిక్ డైరెక్టర్ వల్ల సినిమా బిజినెస్ పోతుందని నమ్మశక్యంగా లేకపోవడంతో ఆ క్షణమే తాను ఇకపై సినిమాలకు మ్యూజిక్ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ సినిమా రంగంలో నిర్మాతలు బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బతుకుతుంది అని తెలిపాడు. అలాంటి నిర్మాతలకి తన వల్ల డబ్బులు రాకుండా అడ్డుపడుతున్నారు అన్న అనుమానంతో ఇకపై తాను మ్యూజిక్ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాలని తెలిపాడు. ఇది కేవలం నా డెసిషన్ మాత్రమేనని ఈ విషయానికి సంబంధించి హీరో నాగార్జున కు ఎలాంటి సంబంధం లేదని ఆర్పి పట్నాయక్ క్లియర్ గా తెలియజేశారు. అంతేకాకుండా తాను నాగార్జున గారితో కలిసినప్పుడు తనతో ఆయన ఎప్పుడు బాగానే మాట్లాడతారని, మా మధ్య ఎటువంటి గొడవలు లేవని ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…