Tigers Attack: ఇంటెలిజెంట్ బాతు..ఆ పులలను ఓ ఆట ఆడుకుంది..! వీడియో వైరల్..!
Tigers Attack: ప్రపంచంలో క్రూరమైన జంతువులు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఎక్కువగా సింహం, పులి లాంటి జంతువులకు ఎక్కువగా భయపడుతుంటారు. మిగతా జంతువులు కూడా వీటికే ఎక్కువగా భయపడతాయి. ఇక టైగర్, లయన్స్ లను అడవికి రాజులు అని కూడా అంటుంటారు. అయితే వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతాయి.
అందులో సింహం, పులి లాంటి జంతువులు చిన్న చిన్న జంతువులను వెంటాడుతూ.. వేటాడుతూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారంది. పులులను అక్కడ ఉన్న ఓ చిన్న బాతు ఆటాడించింది. ఇక చిన్న బాతును పులులు ఏం చాశాయి… దీనికి సంబంధించి వివరంగా తెలుసుకుందాం.
లాస్ వీడియోస్ ఫ్రమ్ మెక్సికో టు ద వరల్డ్ అనే ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో పోస్టు చేయపడింది. అందులో ఏముందంటే.. ఓ బాతు కొలనులో అటూ ఇటూ తిరుగతూ ఉంటుంది. దాని చుట్టు మూడు పులులు ఉండి..దానిని పట్టుకునేందుకు ప్రయత్నించాయి.
కానీ.. ఒక పులి వచ్చి పట్టుకునే లోపు నీటిలో మునుగుతూ ఆ పులికి తెలియకుండా..అటూ ఇటు తిరుగుతుంది. మళ్లీ నీటిలో నుంచి బయటకు వచ్చి.. బయటకు చూస్తున్న క్రమంలో మళ్లీ దానిపై ఈ సారి రెండు పులులు దాడి చేస్తాయి. అది మాత్రం వాటికి చిక్కకుండా తప్పించుకుంటూ కనిపిస్తుంది. ఇదంతా ఆ బాతుకు ప్రమాదకరమైనదే అయినప్పటకీ ఈ వీడియో చూస్తుంటే మాత్రం బాతు తప్పించుకునే విధానం మాత్రం అందరినీ అలరించింది. ఒకానొక సమయంలో ఆ డక్ దొరికిపోతుందేమో అనే అనుమానం కలుగుతుంది. కానీ, బాతు అలా చిక్కినట్లే చిక్కి మాయమవుతున్నది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. బాతు ఇంటెలిజెంట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…