బుల్లితెరపై ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారందరూ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీని దక్కించుకుని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా జబర్దస్త్ కమెడియన్ సాయి తేజ ఉరఫ్ ప్రియాంక సింగ్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు.
ప్రియాంక సింగ్ అబ్బాయిగా పుట్టినప్పటికీ సర్జరీల ద్వారా అమ్మాయిగా మారి తన పేరును సాయి తేజ నుంచి ప్రియాంక సింగ్ గా మార్చుకున్నారు.తెరపై కామెడీ చేస్తూ అందరినీ నవ్విస్తూ ఉన్నటువంటి ఈమె నిజ జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయని పలు సందర్భాలలో తెలియజేసింది.ప్రపంచానికి తను ఒక అబ్బాయి సాయితేజగా తెలిసినప్పటికీ తనకు చిన్నప్పటి నుంచి అమ్మాయిగా మారాలని ఎంతో ఇష్టంగా ఉండేదని,చిన్నప్పటి నుంచి అక్క డ్రస్సులు వేసుకోవడం అక్క చీరలు కట్టుకోవడం వల్ల అమ్మాయిగా మారాలనే కోరిక బలంగా మారిందని తెలిపారు.
అయితే ఈ విషయం తన తల్లిదండ్రుల దగ్గర చెబితే కాదంటారన్న ఉద్దేశంతో తన స్నేహితుల సహాయం తీసుకొని ఎంతో డబ్బుఖర్చు చేసి సర్జరీల ద్వారా అమ్మాయిగా మారానని అయితే ఈ విషయం తన తండ్రికి ఇప్పటికీ తెలియదని ఈమె బిగ్ బాస్ వేదికపై ఈ విషయాన్ని బయటపెట్టారు. లక్షలు డబ్బును ఖర్చు చేసి సర్జరీ తర్వాత తొమ్మిది నెలల పాటు ఎంతో నరకం అనుభవించానని ప్రియాంక తను పడిన కష్టాన్ని వెల్లడించారు.
సాయి తేజ నుంచి ప్రియాంకగా మారిన తర్వాత కూడా ఈమెకు అవకాశాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. అయితే ఈమె సర్జరీ ఎక్కడ చేయించుకున్నారు అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఆ విషయాలన్నీ పూర్తిగా నా వ్యక్తిగతమని,సర్జరీ చేయించుకోవడం కోసం లక్షల్లో డబ్బు ఖర్చు అయిందనే విషయాన్ని మాత్రమే వెల్లడించారు. ఇక అమ్మాయిగా మారిన తర్వాత అవకాశాల కోసం గ్లామరస్ ఫోటోలను నిత్యం సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే తను పూర్తిస్థాయిలో అమ్మాయినని, తన సాయితేజ కాదనే విషయాన్ని ఎన్నో సందర్భాలలో వెల్లడించారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…