బుల్లితెరపై ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారందరూ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీని దక్కించుకుని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా జబర్దస్త్ కమెడియన్ సాయి తేజ ఉరఫ్ ప్రియాంక సింగ్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు.
ప్రియాంక సింగ్ అబ్బాయిగా పుట్టినప్పటికీ సర్జరీల ద్వారా అమ్మాయిగా మారి తన పేరును సాయి తేజ నుంచి ప్రియాంక సింగ్ గా మార్చుకున్నారు.తెరపై కామెడీ చేస్తూ అందరినీ నవ్విస్తూ ఉన్నటువంటి ఈమె నిజ జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయని పలు సందర్భాలలో తెలియజేసింది.ప్రపంచానికి తను ఒక అబ్బాయి సాయితేజగా తెలిసినప్పటికీ తనకు చిన్నప్పటి నుంచి అమ్మాయిగా మారాలని ఎంతో ఇష్టంగా ఉండేదని,చిన్నప్పటి నుంచి అక్క డ్రస్సులు వేసుకోవడం అక్క చీరలు కట్టుకోవడం వల్ల అమ్మాయిగా మారాలనే కోరిక బలంగా మారిందని తెలిపారు.
అయితే ఈ విషయం తన తల్లిదండ్రుల దగ్గర చెబితే కాదంటారన్న ఉద్దేశంతో తన స్నేహితుల సహాయం తీసుకొని ఎంతో డబ్బుఖర్చు చేసి సర్జరీల ద్వారా అమ్మాయిగా మారానని అయితే ఈ విషయం తన తండ్రికి ఇప్పటికీ తెలియదని ఈమె బిగ్ బాస్ వేదికపై ఈ విషయాన్ని బయటపెట్టారు. లక్షలు డబ్బును ఖర్చు చేసి సర్జరీ తర్వాత తొమ్మిది నెలల పాటు ఎంతో నరకం అనుభవించానని ప్రియాంక తను పడిన కష్టాన్ని వెల్లడించారు.
సాయి తేజ నుంచి ప్రియాంకగా మారిన తర్వాత కూడా ఈమెకు అవకాశాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. అయితే ఈమె సర్జరీ ఎక్కడ చేయించుకున్నారు అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఆ విషయాలన్నీ పూర్తిగా నా వ్యక్తిగతమని,సర్జరీ చేయించుకోవడం కోసం లక్షల్లో డబ్బు ఖర్చు అయిందనే విషయాన్ని మాత్రమే వెల్లడించారు. ఇక అమ్మాయిగా మారిన తర్వాత అవకాశాల కోసం గ్లామరస్ ఫోటోలను నిత్యం సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే తను పూర్తిస్థాయిలో అమ్మాయినని, తన సాయితేజ కాదనే విషయాన్ని ఎన్నో సందర్భాలలో వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…