అమరావతి: భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల కొనుగోలు చేసిన లగ్జరీ కారు లంబోర్గిని ఉరుస్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఈ కారు నంబర్ ‘3015’ నెట్టింట వైరల్గా మారి, అభిమానుల్లో కుతూహలం రేపింది. ఈ నంబర్ వెనుక ఉన్న స్పెషల్ విషయం ఏమిటని అభిమానులు శోధించగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.
కుటుంబానికి సంబంధించిన అంకెలు
రోహిత్ శర్మ తన జీవితంలోని ముఖ్యమైన విషయాలను కారు నంబర్లో పొందుపరిచారని తెలుస్తోంది.
ఈ విధంగా తన కుటుంబ సభ్యుల పుట్టినరోజులను, తన జెర్సీ నంబర్ను కలిపి రోహిత్ శర్మ ఈ నంబర్ను ప్రత్యేకంగా ఎంచుకున్నారని అభిమానులు భావిస్తున్నారు. గతంలో కూడా రోహిత్ పాత కారు నంబర్ 264, వన్డేల్లో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం.
రూ.4.57 కోట్ల విలువైన కారు
రూ. 4.57 కోట్ల విలువైన ఈ లంబోర్గిని ఉరుస్ ప్రస్తుతం రోహిత్ లగ్జరీ కలెక్షన్లో కొత్త ఆకర్షణగా నిలిచింది. రోహిత్ చివరిసారిగా భారత్ తరఫున ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. మరో రెండు నెలల తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్లో ఆడనున్నాడు. ఇప్పటికే టీ20లు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, వన్డే ఫార్మాట్లో కొనసాగుతూ 2027 వన్డే ప్రపంచకప్ను లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే, మేనేజ్మెంట్ దేశవాళీ క్రికెట్లో కూడా ఆడాలని సూచించగా, రోహిత్ ఏ నిర్ణయం తీసుకుంటాడన్నది అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…