దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫాంస్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫిక్ల్స్, జీ 5 యాప్, డిస్నీ ప్లస్, హాట్ స్టార్ సహా పలు ఓటీటీలు ఒకదానికొకటి బాగా పోటీపడుతూ డిజిటల్ రంగంలో సత్తా చాటుతున్నాయి. రాను రాను సినిమాను థియేటర్స్కు వెళ్ళి చూసే ప్రేక్షకులు చాలా శాతం తగ్గుతుందని ఇప్పటికే నిపుణులు అంచనా వేస్తున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు, మరో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ లాంటి వారు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. థియేటర్స్కు వెళ్ళి సినిమా చూడరని మేము అనడం లేదు. కానీ ఇంతకముందులా థియేటర్స్లోనే వెళ్ళి సినిమా చూడాలనే మైండ్ సెట్ మారిపోతుందని చెప్పుకొచ్చారు.
గత ఏడాది నుంచి కరోనా సినిమాల విషయంలో జనాల మైండ్ సెట్ దాదాపు మార్చివేసింది. 2.1, 5.1 వన్ ఉన్న హోమ్ థియేటర్స్లో చక్కగా కూర్చొని సినిమా చూడొచ్చుననే ఆలోచనకి ప్రేక్షకులను తీసుకువచ్చింది. ఎంతైనా థియేటర్ ఫీల్ వేరే అని మన స్టార్ హీరోలు, దర్శక..నిర్మాతలు చెప్పుకొస్తున్నా..మాకు సేఫ్టీ కూడా ముఖ్యం, డబ్బు ఆదా కూడా చాలా అవసరం అనే థాట్లో జనాలు కొంత శాతం అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇప్పటికే సినిమా థియేటర్స్ కంటే స్మాల్ స్క్రీన్కే జనాల ప్రాధాన్యత బాగా పెరిగింది.
ఇక గత ఏడాది నుంచి ఓటీటీలకి ఇదే రేంజ్లో ఆదరణ దక్కుతోంది. ఒక సినిమాను ఇంట్లో అందరూ కలిసి కూర్చొని చూసే విధానానికి చాలావరకు అలవాటు పడ్డారు. దీన్ని దృష్ఠిలో పెట్టుకొనే అన్నీ సినిమా ఇండస్ట్రీలలోని మేకర్స్ ఎక్కువ రిస్క్ చేయకుండా తమ సినిమాలకు భారీ ఆఫర్ వస్తే ఓటీటీలతో ఢీల్ కుదుర్చుకొని సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ఇచ్చేస్తున్నారు. ఇటీవల తెలుగులో నారప్ప వచ్చి మంచి హిట్ సాధించింది. తమిళ హీరో సూర్య కూడా తన రెండు సినిమాలు ఆకాశం నీ హద్దురా, జై భీమ్ చిత్రాలను ఓటీటీలో రిలీజ్ చేసి భారీ విజయాలను, విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు.
అందుకే అల్లు అరవింద్ కూడా ఎక్కువగా డిజిటల్ కంటెంట్ మీద ఫోకస్ పెడుతున్నారు. అంతర్జాతీయ ఓటీటీలకు ధీటుగా ఆహాను తీసుకువచ్చారు. మొదట్లో ఆహాకు అంతగా ఆదరణ దక్కలేదు. అయితే నెమ్మదిగా చిన్న సినిమాలను టాలెంటెడ్ డైరెక్టర్స్తో వెబ్ సిరీస్లను టాక్ షోస్ను తీసుకువచ్చి ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేశారు అల్లు అరవింద్. ఆహాలో కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాషలలో రిలీజై హిట్గా నిలిచిన చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలను తెలుగులో డబ్ చేసి ప్రేక్షకులకు ఆహా ద్వారా అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
ఈ క్రమంలోనే కొంత బోల్డ్ కంటెంట్ను తీసుకువస్తున్నారు. ఇలాంటి కంటెంట్తో రూపొందుతున్న వెబ్ సిరీస్లు, సినిమాలు బాగానే ఆదరణను దక్కించుకుంటున్నాయి. అంతకముందు పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో అనగనగా ఓ అతిథి అనే మూవీ వచ్చి ఆకట్టుకుంది. ఇదే క్రమంలో ఇప్పుడు త్రీ రోజెస్ అనే మరో వెబ్ సిరీస్ వచ్చింది. ఇందులో ఈషా రెబ్బ, పాయల్ రాజ్పుత్, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీనికి మారుతి పర్యవేక్షకుడు. మాగీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇలాంటి కంటెంట్తో ఆహాకు మరింత క్రేజ్ వస్తుందని మేకర్స్ ప్లాన్. ఇలాంటివి మరినీ రాబోతున్నాయి.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…