2012 సంవత్సరలో పెళ్లి బంధంతో ఒకటైన జంట సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్. సైఫ్ కి ఇది రెండో వివాహం. అంతక ముందు సైఫ్ అలీఖాన్ మొదటి భార్య అయిన అమృతా సింగ్ నుంచి విడిపోయి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సైఫ్, కరీనా వివాహ బంధం.. మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాఫీగా సాగిపోతోంది.
అతడికి మొదటి భార్యకు ఇద్దరు సంతానం. అందులో సారా అలీ ఖాన్, ఇబ్రహీంలు.. రెండో భార్య కరీనాకు తైమూర్, జహంగీర్ జన్మించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ మధ్య కాలంలో సైఫ్ వరుస చిత్రాలతో ఫుల్ బిజీ అయిపోయాడు.
తాజాగా అతడు బంటీ ఔర్ బబ్లీ 2 చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. దీనిలో హీరోయిన్ గా రాణీ ముఖర్జీ నటిస్తున్నారు. వీళ్లిద్దరుకలిసి ఇటీవల కపిల్ శర్మ షోకి హాజరయ్యారు. ఇందులో సైఫ్ ని కపిల్ ఓ ప్రశ్న అడుగుతాడు. అందేంటంటే.. ఇలా వరుస సినిమాలు చేయడానికి గల కారణం ఏంటి.. పనిమీద ప్రేమతోనా.. లేదా ఇంటి బాధ్యతలు ఎక్కువ కావడం వల్లనా అంటూ అడుగుతాడు.
ఇలా సినిమాలు తీయడం ఫ్యామిలీ కోసం కాదు.. ఇంట్లో ఉంటే ఇంకా ఎక్కువ పిల్లలు పుడతారేమో అనే భయంగా.. వర్క్ లో బిజీ అయిపోతున్నానంటూ చమత్కరించాడు. దీంతో అక్కడ ఉన్న వాళ్లకు నవ్వు ఆగలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానికి ఆ షోకి హాజరైన వాళ్లలో కొందరు.. కరీనా అంతలా మిమ్మల్ని టెంప్ట్ చేస్తుందా అంటూ సెటైర్లు వేశారు.
వేసవి సెలవుల సందడి ముగిసింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు మళ్లీ విద్యార్థులతో కళకళలాడాల్సిన రోజు…
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గత కొద్ది రోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షాలు కొంత ఉపశమనం…
అర్ధరాత్రి వేళ పరుగులు తీస్తున్న ఎక్స్ప్రెస్ రైలులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతోందో అర్థం…
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పుల దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకు…
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…