Featured

“మన్యంలో మంగమ్మ”షూటింగ్ మధ్యలో ఆగిపోయి ఓ బ్లాక్ బస్టర్ ‌ సినిమాగ విడుదలైందని మీకు తెలుసా..!!

దర్శకరత్న దాసరి నారాయణరావు శిష్యులైన కోడి రామకృష్ణ, రవిరాజా పినిశెట్టి, రేలంగి నరసింహారావు లాంటి శిష్యుల్లో ఒకరాయన. కాకపోతే మిగతా శిష్యులతో పోలిస్తే ఈయన ఎంచుకున్న జోనర్ వేరు. ఆయన తీసిన సినిమాలన్నీ విప్లవాత్మక ధోరణిలో ఉండేవి. కార్మికుల కష్టాలు, పేదవారి ఆకలి, ఆక్రందనలే ఆయన ప్రధాన కథ. సినిమా అంటే వినోదం మాత్రమే కాదు, సామాజిక సందేశం, సమాజ మార్పు అనేది గట్టిగా నమ్మిన దర్శకుడు. ఆయన జీవితంలో ఎదురైన, స్వయంగా చూసిన సామాజిక స్థితిగతులను దృశ్య రూపకంగా మలచి నిలువుటద్దంలా ప్రేక్షకుల ముందు ఉంచారు.

పశ్చిమగోదావరి, నరసాపురంలో జన్మించిన ధవళ సత్యం. సినిమాల్లోకి రాకముందు ఆయన ప్రజానాట్య మండలిలో పనిచేశారు. జనసంద్రంలో తాను ఒక ఇసుకరేణువుగ భావించి భావిభారత పునర్నిర్మాణానికి తనవంతు కృషిగా సామాజిక మార్పుకోసం అనేక నాటకాలను ప్రదర్శించారు. సత్యంవధ, ఇరుసు, జ్వాలా శిఖలు లాంటి నాటకాలను ప్రదర్శనతో ఆయనకు మంచి పేరు వచ్చింది. మద్రాసులో అడుగుపెట్టిన తర్వాత ఆయన దాసరి గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. ఆయన మహమ్మద్ బీన్ తుగ్లక్, శివరంజని, రంగూన్ రౌడీ, రాముడే రావణుడు లాంటి సినిమాలకు సహాయ దర్శకుడిగా చేశారు. ఆ తర్వాత సుప్రీం హీరో చిరంజీవితో ఒక సినిమా చేశారు.

1980లో రామరాజు నిర్మాణము, ధవళ సత్యం దర్శకత్వంలో చిరంజీవి, లీలావతి హీరో, హీరోయిన్లుగా జాతర సినిమాలో నటించారు. ఆ తర్వాత ఎర్రమల్లెలు, యువతరం కదిలింది, గుడి గంటలు మ్రోగాయి, రామాపురంలో సీత, భీముడు లాంటి సినిమాలను రూపొందించారు. ఆ తర్వాత మాదాల రంగారావు కొడుకు మాదాలరవి తో నేను సైతం అనే సినిమాను రూపొందించారు. గిరిజన స్థితిగతులను చూసి, స్పందించిన ధవళ సత్యం వారి జీవన విధానాలపై ఒక సినిమా రూపొందించాలనుకున్నారు. ఆ క్రమంలో గిరిజనతండాలో ఒక మహిళకు ఎదురైన ప్రతిబంధకాలు, వాటిని ఎదుర్కోవడంలో ఆ మహిళ ఏ విధంగా పోరాటం చేసి చివరికి గెలిచిందో అనే అంశంపై ఆ రోజుల్లో సపోర్టింగ్ రోల్స్ లో శరత్ బాబు, శ్రీనివాసవర్మ, శారద ప్రధానపాత్రలో “మన్యంలో మంగమ్మ” సినిమా షూటింగ్ ధవళ సత్యం మొదలుపెట్టారు.

దాదాపు పదిహేను రోజుల వరకు షూటింగ్ జరిగిన తర్వాత కొన్ని ఆర్థిక ఇబ్బందుల వలన సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత సినిమాకు సంబంధించిన కథ శారద ద్వారా ఇతర రచయిత, దర్శకులకు తెలిసింది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత 1997లో విజయశాంతి ప్రధాన పాత్రలో దాసరి నారాయణరావు ఒసేయ్ రాములమ్మ అనే చిత్రాన్ని రూపొందించడం జరిగింది. అయితే శారద ప్రధానపాత్రలో మన్యంలో మంగమ్మ అనే ఆగిపోయిన సినిమా కథ,ఒసేయ్ రాములమ్మ కథ ఒకటేనని.. దవళ సత్యం ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

9 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

12 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

12 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

13 hours ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

15 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

15 hours ago