సినిమా ఇండస్ట్రీలో సహ నటీ నటులు వారితో ఉండే బంధం బయట ప్రపంచానికి పూర్తి భిన్నంగా కనిపిస్తుంటుంది. సినిమాలలో ప్రేమికులుగా కనిపించే హీరో, హీరోయిన్స్ని గానీ..ఇద్దరి కమెడియన్స్ని గానీ..లేదా వరుసగా సినిమాలలో జత కట్టి హిట్ పెయిర్గా పేరు సంపాదించుకున్న వాళ్ళను చాలామంది ప్రేమికులుగానో, పెళ్ళి చేసుకుంటే బావుంటదనే భావనలోకి వచ్చేస్తారు. ఎందుకంటే ఆ హిట్ పెయిర్ సిల్వర్ స్క్రీన్ మీద అంతగా అలరిస్తారు. నాలుగు సినిమాలలో కలిసి నటించిన ఏ నటీ నటుల విషయంలో అయినా ప్రేక్షకులకి ఇలాంటి భావన రావడం సహజం.
అప్పట్లో ఎన్.టి.ఆర్ – సావిత్రి, ఏ.ఎన్.ఆర్ – సావిత్రి, ఏ.ఎన్.ఆర్ – జమున, ఎన్.టి.ఆర్ – జమున..రాజబాబు – రమా ప్రభ, చలం – రమాప్రభ, రేలంగి – గిరిజ లాంటి హిట్ పెయిర్కి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉండేది. అందుకే దర్శక, నిర్మాతలు కూడా వీరిని ప్రధానంగా చేసుకునే కొన్ని సన్నివేశాలు సినిమాలలో తప్పకుండా ఉండాలని రచయితల వద్ద పట్టుబట్టేవారు. అలాంటి స్టార్ కపుల్ గనక స్క్రీన్ మీద కనపడి సందడి చేస్తుంటే థియేటర్స్లో ఆడియన్స్ ఫీలయ్యేది వేరే లెవల్. హీరో హీరోయిన్స్ స్క్రీన్ మీద నటిస్తుంటే కొందరు వారిలో తమని తాము ఊహించుకుంటూ..మరో లోకంలోకి వెళ్ళి వస్తారు.
ఇక ఇదే క్రమంలో ఆనాటి క్రేజీ కపుల్ అంటే రేలంగి – గిరిజ. వీరి కాంబినేషన్ని ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. ఎన్ని సినిమాలలో నటించినా వీరికి ఓ ప్రత్యేక స్థానం ఉండేది. అయితే అదే తర్వాత గిరిజకి శాపంగా మారుతుందని ఊహించలేకపోయింది. 1950 నుంచి 1960 దశకాల్లో తనకి తిరుగంటూ లేకుండా ఏకచత్రాధిపత్యంగా సినీ ఇండస్ట్రీని ఏలిన హాస్య మహారాణి గిరిజ. అప్పట్లో కామెడీ పాత్రలంటే కేరాఫ్ అడ్రస్గా ఆమె నిలిచారు. ఎంత పెద్ద స్టార్స్ ఉన్నా కామెడీ పాత్రంటే మాత్రం దర్శక, నిర్మాతలకి కావాల్సింది గిరజ మాత్రమే.
అంతగా తన హాస్యంతో థియేటర్స్ దద్దరిల్లేలా చేసేవారు. పరమానందయ్య శిష్యులు అనే సినిమాతో అక్కినేని నాగేశ్వరరావు సరసన హీరోయిన్గా సినీరంగ ప్రవేశం చేశారు. తర్వాత పాతాళభైరవి చిత్రంలోని ‘నరుడా ఏమి నీ కోరిక’ అనే ఒకే ఒక్క డైలాగ్ తో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. అప్పటి ప్రముఖ హాస్యనటుడు రేలంగితో జతకట్టిన తర్వాత ఆనాటి హీరో-హీరోయిన్లకు సమానంగా పాపులారిటీని సంపాదించుకున్నారు. ‘అన్నపూర్ణ’, ‘గుడిగంటలు’, ‘అప్పుచేసి పప్పుకూడు’,
‘జగదేకవీరుని కథ’, ‘ఆరాధన’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకున్నారు.
ఒకవైపు హాస్యనటిగా నటిస్తూనే, మరోవైపు అక్కినేని నాగేశ్వరరావుతో వెలుగునీడలు, ఎన్.టి.రామారావుతో మంచి మనసుకు మంచిరోజులు, జగ్గయ్యతో అత్తా ఒకింటి కోడలే, శివాజీగణేశన్ తో మనోహర, హరనాథ్ తో మా ఇంటి మహాలక్ష్మి, చలంతో కులదైవం, జె.వి.రమణమూర్తి తో ఎం.ఎల్.ఏ వంటి స్టార్స్తో కలిసి హీరోయిన్గా నటించారు. గిరిజకు సి.సన్యాసిరాజు అనే సినీ దర్శకుడితో పెళ్లి జరిగింది. గిరిజ భర్త సన్యాసిరాజును నిర్మాతను చేయడానికి ఎంతగానో ప్రయత్నించారు. అనుకున్నట్టుగానే విజయగిరి ధ్వజా ప్రొడక్షన్స్ అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి 1969లో ఎన్టీఆర్, కాంచన, అంజలితో ‘భలే మాస్టారు’ సినిమా తీశారు.
ఈ సినిమా ఆశించినంతగా విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్, చంద్రకళతో ‘పవిత్ర హృదయాలు’ తీశారు. ఆ సినిమా కూడా ఫ్లాప్గా మిగిలింది. దాంతో గిరిజ సంపాదించిన ఆస్థులన్నీ పోగొట్టుకున్నారు. మద్రాసులో కొనుక్కున రెండంతస్థుల విశాలమైన భవనం అప్పుల కారణంగా చేజారిపోయింది. ఇక ముఖ్యంగా తన సహ నటుడు రేలంగి మరణించిన తరువాత గిరిజకు సినిమాల్లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దాంతో సొంత ఇంటిని కూడా కోల్పోయి చివరకు చిన్న అద్దె గదిలోకి మారే పరిస్థితికి వచ్చారు. పూట గడవని స్థితికి వచ్చారు. రాజశ్రీ, సుజాత వంటి సహనటీమణుల ఆదరణతో కొంతకాలం ధీన పరిస్థిని నెట్టుకొచ్చిన గిరిజ ఆ తర్వాత మృతి చెందారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…