సినిమా ఇండస్ట్రీలో సహ నటీ నటులు వారితో ఉండే బంధం బయట ప్రపంచానికి పూర్తి భిన్నంగా కనిపిస్తుంటుంది. సినిమాలలో ప్రేమికులుగా కనిపించే హీరో, హీరోయిన్స్ని గానీ..ఇద్దరి కమెడియన్స్ని గానీ..లేదా వరుసగా సినిమాలలో జత కట్టి హిట్ పెయిర్గా పేరు సంపాదించుకున్న వాళ్ళను చాలామంది ప్రేమికులుగానో, పెళ్ళి చేసుకుంటే బావుంటదనే భావనలోకి వచ్చేస్తారు. ఎందుకంటే ఆ హిట్ పెయిర్ సిల్వర్ స్క్రీన్ మీద అంతగా అలరిస్తారు. నాలుగు సినిమాలలో కలిసి నటించిన ఏ నటీ నటుల విషయంలో అయినా ప్రేక్షకులకి ఇలాంటి భావన రావడం సహజం.
అప్పట్లో ఎన్.టి.ఆర్ – సావిత్రి, ఏ.ఎన్.ఆర్ – సావిత్రి, ఏ.ఎన్.ఆర్ – జమున, ఎన్.టి.ఆర్ – జమున..రాజబాబు – రమా ప్రభ, చలం – రమాప్రభ, రేలంగి – గిరిజ లాంటి హిట్ పెయిర్కి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉండేది. అందుకే దర్శక, నిర్మాతలు కూడా వీరిని ప్రధానంగా చేసుకునే కొన్ని సన్నివేశాలు సినిమాలలో తప్పకుండా ఉండాలని రచయితల వద్ద పట్టుబట్టేవారు. అలాంటి స్టార్ కపుల్ గనక స్క్రీన్ మీద కనపడి సందడి చేస్తుంటే థియేటర్స్లో ఆడియన్స్ ఫీలయ్యేది వేరే లెవల్. హీరో హీరోయిన్స్ స్క్రీన్ మీద నటిస్తుంటే కొందరు వారిలో తమని తాము ఊహించుకుంటూ..మరో లోకంలోకి వెళ్ళి వస్తారు.
ఇక ఇదే క్రమంలో ఆనాటి క్రేజీ కపుల్ అంటే రేలంగి – గిరిజ. వీరి కాంబినేషన్ని ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. ఎన్ని సినిమాలలో నటించినా వీరికి ఓ ప్రత్యేక స్థానం ఉండేది. అయితే అదే తర్వాత గిరిజకి శాపంగా మారుతుందని ఊహించలేకపోయింది. 1950 నుంచి 1960 దశకాల్లో తనకి తిరుగంటూ లేకుండా ఏకచత్రాధిపత్యంగా సినీ ఇండస్ట్రీని ఏలిన హాస్య మహారాణి గిరిజ. అప్పట్లో కామెడీ పాత్రలంటే కేరాఫ్ అడ్రస్గా ఆమె నిలిచారు. ఎంత పెద్ద స్టార్స్ ఉన్నా కామెడీ పాత్రంటే మాత్రం దర్శక, నిర్మాతలకి కావాల్సింది గిరజ మాత్రమే.
అంతగా తన హాస్యంతో థియేటర్స్ దద్దరిల్లేలా చేసేవారు. పరమానందయ్య శిష్యులు అనే సినిమాతో అక్కినేని నాగేశ్వరరావు సరసన హీరోయిన్గా సినీరంగ ప్రవేశం చేశారు. తర్వాత పాతాళభైరవి చిత్రంలోని ‘నరుడా ఏమి నీ కోరిక’ అనే ఒకే ఒక్క డైలాగ్ తో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. అప్పటి ప్రముఖ హాస్యనటుడు రేలంగితో జతకట్టిన తర్వాత ఆనాటి హీరో-హీరోయిన్లకు సమానంగా పాపులారిటీని సంపాదించుకున్నారు. ‘అన్నపూర్ణ’, ‘గుడిగంటలు’, ‘అప్పుచేసి పప్పుకూడు’, ‘జగదేకవీరుని కథ’, ‘ఆరాధన’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకున్నారు.
ఒకవైపు హాస్యనటిగా నటిస్తూనే, మరోవైపు అక్కినేని నాగేశ్వరరావుతో వెలుగునీడలు, ఎన్.టి.రామారావుతో మంచి మనసుకు మంచిరోజులు, జగ్గయ్యతో అత్తా ఒకింటి కోడలే, శివాజీగణేశన్ తో మనోహర, హరనాథ్ తో మా ఇంటి మహాలక్ష్మి, చలంతో కులదైవం, జె.వి.రమణమూర్తి తో ఎం.ఎల్.ఏ వంటి స్టార్స్తో కలిసి హీరోయిన్గా నటించారు. గిరిజకు సి.సన్యాసిరాజు అనే సినీ దర్శకుడితో పెళ్లి జరిగింది. గిరిజ భర్త సన్యాసిరాజును నిర్మాతను చేయడానికి ఎంతగానో ప్రయత్నించారు. అనుకున్నట్టుగానే విజయగిరి ధ్వజా ప్రొడక్షన్స్ అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి 1969లో ఎన్టీఆర్, కాంచన, అంజలితో ‘భలే మాస్టారు’ సినిమా తీశారు.
ఈ సినిమా ఆశించినంతగా విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్, చంద్రకళతో ‘పవిత్ర హృదయాలు’ తీశారు. ఆ సినిమా కూడా ఫ్లాప్గా మిగిలింది. దాంతో గిరిజ సంపాదించిన ఆస్థులన్నీ పోగొట్టుకున్నారు. మద్రాసులో కొనుక్కున రెండంతస్థుల విశాలమైన భవనం అప్పుల కారణంగా చేజారిపోయింది. ఇక ముఖ్యంగా తన సహ నటుడు రేలంగి మరణించిన తరువాత గిరిజకు సినిమాల్లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దాంతో సొంత ఇంటిని కూడా కోల్పోయి చివరకు చిన్న అద్దె గదిలోకి మారే పరిస్థితికి వచ్చారు. పూట గడవని స్థితికి వచ్చారు. రాజశ్రీ, సుజాత వంటి సహనటీమణుల ఆదరణతో కొంతకాలం ధీన పరిస్థిని నెట్టుకొచ్చిన గిరిజ ఆ తర్వాత మృతి చెందారు.
Pitapuram: ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి అయితే ఎన్నికల హడావిడి మొదలైనప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అందరి చూపు పిఠాపురం నియోజకవర్గం పైనే ఉంది. ఈ నియోజకవర్గంలో ఎవరి జెండా ఎగురుతుందన్న విషయంపై ఎంతో ఆసక్తి నెలకొంది. ఇలా పిఠాపురం పైన ఇంత ఆసక్తి రావడానికి కారణం అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే కారణమని చెప్పాలి.
గత ఎన్నికలలో భీమవరం గాజువాకలో పోటీ చేసి ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం కాపులు అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు ఈ క్రమంలోనే ఈయనకు పోటీగా వైసిపి పార్టీ నుంచి వంగా గీత ఎన్నికల బరిలోకి దిగారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ ఎవరు గెలుస్తారో అన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ఇప్పటికే ఎన్నో చానల్స్ వారు ప్రజా సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో భాగంగా ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలే ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. వంగా గీత కూడా అదే సామాజిక వర్గానికి చెందిన మహిళ అంతేకాకుండా ప్రస్తుతం కాకినాడ ఎంపీగా కూడా ఈమె కొనసాగుతున్నారు. ఇలాంటి తరుణంలో వంగా గీత కాకుండా పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని తెలుస్తోంది.
Advertisement
జనసేనదే విజయమా.. ఇకపోతే వంగా గీత 2009వ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగి పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారు అయితే అప్పట్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చిన పిఠాపురానికి చేయాల్సినటువంటి న్యాయం చేయలేకపోయారని అందుకే ఈసారి పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతున్నామంటూ చాలామంది ప్రజలు పవన్ కళ్యాణ్ గెలుపుకు కృషి చేస్తున్నారంటూ పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి చూడాలి మరి పిఠాపురంలో ఏ జెండా ఎగురుతుంది వంగా గీత పవన్ కళ్యాణ్ కి ఎలా పోటీగా నిలబడతారు అనేది తెలియాల్సి ఉంది.
AP politics: రేపు ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఎలాంటి పొత్తు లేకుండా ఎన్నికల బరిలోకి దిగిపోతుంది కానీ తెలుగుదేశం పార్టీతో జనసేన బిజెపి పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే ఇలా కూటమిగా ఏర్పడి ఎన్నికలలో గెలిచి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ముందుకు నడిపించాలని ధ్యేయంగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు వెల్లడించారు.
ఇలా ఈ మూడు పార్టీల కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగుతున్నటువంటి తరుణంలో కొన్ని నియోజకవర్గాలలో పార్టీల కోసం ఎంతో కష్టపడినటువంటి వారికి సీట్లు రాకపోవడంతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోనే జనసేనలోనూ కూడా అభ్యర్థులు అలకలు మొదలుపెట్టారు. ఇటీవల బీజేపీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడ వెస్ట్ సీటు జనసేన పార్టీకే కేటాయిస్తారని, పార్టీ తరపున తనకే సీటు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న పోతిన మహేష్ ఈ సీటు బీజేపీకి వెళ్లిపోవడంతో చాలా అసంతృప్తికి గురయ్యారు.
ఇలా బిజెపికి సేటు కేటాయించడంతో మహేష్ ఏకంగా జనసేన పార్టీ కార్యాలయం ముందు రెండు గంటల పాటు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఇక ఈయనని పవన్ కళ్యాణ్ పిలిపించుకొని తనని బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు పదవి తప్పకుండా ఇస్తామని చెప్పిన మహేష్ మాత్రం తనకు టికెట్ కావాలని కోరారు.
Advertisement
పొత్తు ధర్మాన్ని పాటించండి.. ఇలా అభ్యర్థులు సహకరించకపోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు.పొత్తు ధర్మాన్ని పాటిద్దామని కూటమిని గెలిపిద్దామంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రెస్నోట్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసమే కూటమి ఏర్పాటు చేశామని ప్రస్తావించారు. ఆ పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
AP Politics: ఏపీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నటువంటి తరుణంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ బస్సు యాత్రలో భాగంగా ప్రొద్దుటూరులో బహిరంగ సభ నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ సభలో తన బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య గురించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనగా మారాయి. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరో రాష్ట్ర తెలుసనీ, తన చెల్లెలు షర్మిల సునీతను కూడా తమ రాజకీయాలలో పావులుగా వాడుకున్నారని తెలిపారు.
నా చెల్లెమ్మలు ఇద్దరూ కూడా హంతకులకే మద్దతు తెలుపుతున్నారని జగన్ మండిపడ్డారు. చెల్లెమ్మలు చిన్నాన్నను చంపిన వారితో చేతులు కలపగా నేను మాత్రం ప్రజల పక్షమే ఉంటానని జగన్ తెలిపారు. ఇలాంటి హంతకులతో అవినీతిపరులతో యుద్ధం చేయడానికి ఈ అర్జునుడు సిద్ధం మీరు సిద్ధమేనా అంటూ ఈ కార్యక్రమంలో జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.
Advertisement
కూటమి అంటే కుట్రలు.. వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు నాయుడికి 45 ఏళ్ల అనుభవం ఉందని చెప్పారు. ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి చంపి, ఆయన విగ్రహాలకు పూలమాలలు వేశారని అన్నారు. కూటమి అంటే కుట్రలు కుతంత్రాలని జగన్ తెలిపారు. తమ జెండా మాత్రం మరో జెండాతో జతకట్టలేదని చెప్పారు. కేంద్రం నుంచి ఓ పార్టీని తెచ్చుకున్నారని అన్నారు. ఇటీవల చోటుచేసుకున్న డ్రగ్స్ కేసు వెనుక చంద్రబాబు వదిన గారి చుట్టం ఉన్నారంటూ డ్రగ్స్ వ్యవహారంపై కూడా జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.