గత ఏడాదిగా కీర్తి సురేశ్ సినిమా కెరీర్ డేంజర్ జోన్లో ఉందని మాట్లాడుకున్నవారే ఎక్కువ. అందుకు కారణం మహానటి సినిమా తర్వాత కీర్తి ఎంచుకున్న సినిమాల వల్లే ఇలా మాట్లాడుకున్నారు. ఏ హీరోయిన్ అయినా మంచి మైల్ స్టోన్లా మిగిలిపోయే సక్సెస్ వచ్చాక కెరీర్ను మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు. కానీ కొన్నిసార్లు ఆ ప్లాన్స్ అన్నీ వారే ఊహించని విధంగా రివర్స్ అవుతుంటాయి. కీర్తి విషయంలో కూడా ఇదే జరిగింది. మహానటి లాంటి హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్, గొప్ప నటి బయోపిక్ మూవీతో వచ్చిన క్రేజ్తో ఆమె వరుసగా మూడు హీరోయిన్ సెంట్రిక్ ఫిలింస్ ఒప్పుకుంది.
ఇక్కడే కీర్తి సురేశ్ పెద్ద రాంగ్ స్టెప్ వేసింది. మూడు సినిమాలలో ఒకటి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీని ఎంచుకొని రెండు మంచి కమర్షియల్ సినిమాలు కమిటయి ఉంటే ఆమె కెరీర్ మరోలా ఉండేదని చాలామంది మాట్లాడుకున్నారు. ఖచ్చితంగా ఈ మాటలను ఎవరైనా ఏకీభవించవచ్చు. కానీ వరుసగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను ఒప్పుకోవడం వాటిని త్వర త్వరగా పూర్తి చేసి ప్రేక్షకులముందుకు తీసుకు రావడం వరకు బాగానే ఉంది. చెప్పాలంటే ఆమె నటించిన గత చిత్రాలు పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాల మీద భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి.
అయితే కార్తీక్ సుబ్బరాజు నిర్మాణంలో వచ్చిన పెంగ్విన్ సినిమా ఫ్లాప్ సినిమాగా ఎప్పుడైతే మిగిలిందో కొంత కెరీర్కు దెబ్బపడింది. ఈ సినిమాలో నటనపరంగా కీర్తిని ఎవరూ నెగిటివ్గా కామెంట్ చేయలేదు. కానీ ఆమె ఎంచుకున్న కథ సరైంది కాదని కామెంట్స్ చేశారు. ఈ సినిమా సక్సెస్ కీర్తిని కూడా బాగానే డిసప్పాయింట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన మిస్ ఇండియా సినిమా మీద బాగానే అంచనాలు పెరిగాయి. చెప్పాలంటే పెంగ్విన్ సినిమా ప్రభావం మిస్ ఇండియా మీద పడలేదనే చెప్పాలి. అయితే ఈ సినిమా కాన్సెప్ట్ ఎలా కీర్తికి నచ్చిందని మాత్రం రిలీజ్ అయ్యాక మాట్లాడుకున్నారు.
మరీ చెత్త పాయింట్ అనేంతగా మిస్ ఇండియా సినిమా చూసిన వారు కామెంట్స్ చేశారు. సామాన్య ప్రేక్షకుడు కూడా మిస్ ఇండియా సినిమా కథ ఏంటీ ఇలా ఉంది అని మాట్లాడేలా సినిమాను తీశారు. దాంతో కీర్తి కెరీర్ ఒక్కసారిగా డేంజర్ జోన్లో పడినట్టైంది. అందుకే మరో హీరోయిన్ సెంట్రిక్ మూవీ చేసినా కూడా దాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ధైర్యం చేయలేకపోయారని టాక్ వినిపించింది. అయితే కీర్తి మంచి నటి కావడంతో ఆమె ఫ్లాప్ సినిమాలను పక్కనపెట్టి అవకాశాలు ఇచ్చారు. అలా రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓ మోస్తారు హిట్ అందుకుంది.
ఇక సర్కారు వారి పాట సినిమా నుంచి వచ్చిన టీజర్ ఇంకాస్త ఆమెకు పాజిటివ్ టాక్ వచ్చేలా చేసింది. దాంతో మళ్ళీ వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే అణ్ణాత్త రిలీజైంది. రిజల్ట్ విషయం పక్కన పెడితే ఇందులో కీర్తి పర్ఫార్మెన్స్కు మంచి పేరొచ్చింది. ఇక మెగాస్టార్ చిరంజీవికి చెల్లిగా భోళా శంకర్ సినిమాను చేస్తోంది. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఆమెకు వచ్చే క్రేజ్ వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఇదే క్రమంలో నానితో మరోసారి దసరా సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఇప్పుడు కీర్తి టార్గెట్ పూజా హెగ్డే, రష్మిక మందన్న. వారిలా హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకోవాలని గట్టిగా టార్గెట్ పెట్టుకున్నట్టు టాక్ వినిపిస్తోంది.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…