Featured

చేతిలో 30 సినిమాలు..ప్రమాదంలో వెన్నుపూసకు దెబ్బ.. తర్వాత సినిమా అవకాశాలు కోల్పోయిన నూతన ప్రసాద్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు.!!

నూటొక్క జిల్లాల అందగాడు అనగానే ఆంధ్ర ప్రేక్షకులందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు నూతన్ ప్రసాద్. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. నూటొక్క జిల్లాల అందగాడు అని చెప్పే సంభాషణలు నూతన్ ప్రసాద్ ను గుర్తుచేస్తుంటాయి. 1945 కృష్ణా జిల్లాలో జన్మించిన నూతన్ ప్రసాద్ తన విద్యాభ్యాసం పూర్తిచేసి నాగార్జునసాగర్, హైదరాబాదులో ఉద్యోగం చేశారు. ఆ తర్వాత నూతన్ ప్రసాద్ నాటకాలపై అభిమానంతో సుడిగాలి, గాలివాన, కెరటాలు వంటి నాటకాల్లో వివిధ రకాలైన పాత్రను ఆయన పోషించారు.

ఆయన నటించిన మాలపిల్ల నాటకం 101 సార్లు ప్రదర్శించారు. ఆ తర్వాత తెలుగు చలన చిత్ర రంగంలోకి అడుగు పెట్టారు. నూతన్ ప్రసాద్ మొదటగా బాపు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన అందాల రాముడు చిత్రంలో నటించారు. ఆ తర్వాత హాస్య, కరుణ, భయానక పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. బాపు-రమణల కలయికలో వచ్చిన రాజాధిరాజు చిత్రంలో సైతాన్ పాత్ర నూతన్ ప్రసాద్ కి ఎంతగానో పేరు తీసుకువచ్చింది. అందులో కొత్తదేవుడండి…కొంగొత్త దేవుడండీ ఈ పాటలో నూతన్ ప్రసాద్ ఆడి పాడిన తీరు ప్రేక్షకులను అలరిస్తుంది. బాపు దర్శకత్వంలో వచ్చిన మరో చిత్రం ముత్యాలముగ్గు లో నిత్య పెళ్లి కొడుకు పాత్రలో నూతన్ ప్రసాద్ నటన బాగుంటుంది.

శ్రీదేవి హీరోయిన్ గా రాణికాసుల రంగమ్మ చిత్రంలో అమాయకపు పాత్రలో నూతన్ ప్రసాద్ నటన అందరినీ అబ్బుర పరుస్తుంది. ఇలా ఆనందంగా కొనసాగుతున్న ఆయన జీవితంలోకి బామ్మ మాట బంగారు బాట అనే చిత్రంలో నటించే పరిస్థితి వచ్చింది. ఆ సినిమాలో కారులో పెట్రోలుకు బదులు సారా పోయడంతో ఆ కారు గాలిలోకి లేచే సన్నివేశం ఉంటుంది. ఆ కారులో ముందు సీట్లో రాజేంద్ర ప్రసాద్ వెనుక సీట్ లో నూతన్ ప్రసాద్ కూర్చుని ఉంటారు. షూటింగ్ లో భాగంగా కారుని గాల్లోకి గొలుసులతో ఎత్తుతారు. ఆ గొలుసులోని ఒక వరుస అప్పటికే ఓడిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. క్రేన్ తో రెండు కుదుపులు కుదిపే సరికి ఆ గొలుసు కాస్త తెగిపోవడంతో ఒక్కసారిగా గాల్లో నుంచి కారు కింద పడింది. ముందు వరసలో కూర్చున్న రాజేంద్రప్రసాద్ కాస్త దెబ్బ తగలడంతో కోమాలోకి వెళ్లారు. నూతన్ ప్రసాద్ మాత్రం ఆస్పత్రికి తరలించండి అననడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. వెన్నుపూస దెబ్బతినడంతో పూర్తిగా ఆయన వీల్ చైర్ కే అతుక్కుపోయారు.

అప్పటికే ఆయన చేతిలో దాదాపు 30 సినిమాలు ఉన్నాయి. ఒక్కసారిగా వెన్నుపూసకు దెబ్బతినడంతో మునుపటిలా కదులుతూ, నడుస్తూ నటించే అవకాశాన్ని నూతన్ ప్రసాద్ పూర్తిగా కోల్పోయారు. వివిధ రకాలైన పాత్రలతో ఎప్పుడూ బిజీగా ఉండే నూతన్ ప్రసాద్ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా అవకాశాలను కోల్పోవాల్సివచ్చింది. ఒకవేళ అవకాశాలు వచ్చినా కుర్చీలో కూర్చుని కనిపించే జడ్జి పాత్రలో లేదా ప్రమాదానికి గురైన మరొక పాత్రలో నటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెగాస్టార్ చిరంజీవితో అనేక సినిమాల్లో నూతన్ ప్రసాద్ నటించారు. ఆ స్నేహంతో చిరంజీవి తరుచూ నూతన్ ప్రసాద్ ను పరామర్శిస్తూ ఉండేవారు.

సినిమా అవకాశాలు సన్నగిల్లడంతో నూతన్ ప్రసాద్ డబ్బింగ్ వైపు వెళ్లారు. అలా ఈటీవీ లో ప్రసారమయ్యే నేరాలు-ఘోరాలు కార్యక్రమంలో తన వాయిస్ ని అందించారు. నూతన్ ప్రసాద్ వాయిస్ తో కార్యక్రమం ఎంతగానో ప్రజాదరణ పొందింది. ఓ సందర్భంలో ఆయన ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ ఒక ముసలమ్మ మాటలు ఆయనలో ప్రేరణ కలిగించడంతో ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నారు. కొన్ని అనారోగ్య కారణాల వలన 2011 సంవత్సరంలో నూతన్ ప్రసాద్ భువి నుండి దివికేగారు.తమ సహచర నటుడిని కోల్పోవడంతో తెలుగు సినీ పరిశ్రమ కన్నీటి పర్యంతమైంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కోటిన్నర రూపాయల ఇంజెక్షన్ కోసం పోరాటం.. స్పందించిన సీఎం..

తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…

19 hours ago

బెంగళూరులో చిన్నారి మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. మూడు నెలల తర్వాత తల్లి అరెస్ట్..

బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…

19 hours ago

ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీ టమాటాలు.. గుర్తించే సింపుల్ టెస్టులు ఇవే..

ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…

20 hours ago

మామిడి పండ్లు తిన్న తర్వాత అనారోగ్యం.. ఇద్దరు బాలికల మరణం కలకలం

హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…

20 hours ago

ప్రపంచానికి కొత్త వాతావరణ హెచ్చరిక.. ‘గాడ్జిలా ఎల్‌నినో’పై నిపుణుల ఆందోళన

ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…

22 hours ago

నాన్న ఇప్పటికీ ఆటోనే నడుపుతున్నారు..స్టార్ కొరియోగ్రాఫర్ అయినా సొంత ఇల్లు లేదు..పండు మాస్టర్ ఎమోషనల్ స్టోరీ

తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…

22 hours ago