Featured

కంటెంట్ బావుండాలంతే.. ఎక్కడ రిలీజ్ చేసిన ఆదరిస్తారనడానికి వెంకీనే ఎగ్జాంపుల్..

సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్..సినిమా చూడాలంటే ఈ రెండింట్లోనే అనే పద్దతి ఎప్పుడో పోయింది. ఇప్పుడు ట్యాబ్స్, మొబైల్స్ లాంటి వాటిలోను మనకు కావాల్సిన సినిమాను చూసేయొచ్చు. అదే ఇప్పుడు చాలా సినిమాల సక్సెస్‌కు ప్రధాన కారణం అవుతోంది. ఒకప్పుడు సిల్వర్ స్క్రిన్ మీద రిలీజైన సినిమాను చూడాలంటే కనీసం ఓ సంవత్సరం తర్వాతే అని ఉండేది. అప్పుడు బ్లాక్ బస్టర్ అని టాక్ తెచ్చుకున్న సినిమాలు థియేటర్స్‌లోనే 100 రోజులు..150 రోజులు..175 రోజులు..200 రోజులు..225 రోజులు అంటూ ప్రదర్శింపబడుతుండేవి.

ఆ తర్వాత కొన్నాళ్ళకు గానీ ఇదే సినిమా మళ్ళీ స్మాల్ స్క్రీన్ మీద ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుండేవారు. అలా వచ్చిన సినిమాలకు మంచి టీఆర్పీ రేటింగ్ నమోదయ్యేది. ఇప్పుడు అలాకాదు సినిమా ఒక్క షోతోనే హిట్టా..ఫ్లాపా అని డిసైడ్ చేసేస్తున్నారు. అందుకే ఒక్కో సినిమాను మరో సినిమా పోటీ లేకుండా చూసుకొని భారీ సంఖ్యలో థియేటర్స్ లో రిలీజ్ చేసి వారం నుంచి రెండు వారాలలోపే లాభాలు దక్కేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఓ సినిమాను థియేటర్స్‌లో ఉన్నంతవరకే చూడగలము.

ఎత్తేశాక ఇక బుల్లితెరపై వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఓటీటీ పుణ్యమా అని ఎప్పుడు కావాల్సివస్తే అప్పుడు చూడొచ్చు. ఈ సౌలభ్యమే కొన్ని సినిమాలకు మంచి ఆదరణ దక్కేలా చేస్తుంది. కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకుడు ఓటీటీలో చూస్తున్నామా అని ఆలోచించడు. సినిమా చూస్తున్నామా లేదా అని మాత్రమే ఆలోచిస్తారు. అందుకు ఉదాహరణ వెంకటేశ్ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. పెద్ద నిర్మాత, డిస్త్రిబ్యూటర్ అయి ఉండి కూడా అగ్ర నిర్మాత సురేశ్ బాబు థియేటర్స్ లో రిలీజ్ కాకుండా వెంకీ సినిమాలను ఓటీటీలో తీసుకువచ్చి హిట్ అందుకున్నారు.

ఇంతక ముందు తమిళ హిట్ సినిమా అసురన్ తెలుగు రీమేక్ నారప్ప చిత్రం రూపొందించారు. ఈ సినిమాలో వెంకటేశ్ – ప్రియమణి జంటగా నటించారు. తమిళ సినిమా రీమేక్ అనే భావన లేకుండా నారప్ప చిత్రాన్నీ చూసి ప్రేక్షకులు బాగా ఆదరించారు. తాజాగా వచ్చిన దృశ్యం 2 సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు. మలయాళ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అంతక ముందు కోలీవుడ్ స్టార్ హిరో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా, ఇటీవల వచ్చిన జై భీమ్ లాంటి సినిమాలు ఇలా ఓటీటీలో వచ్చి హిట్ టాక్ తెచ్చుకొని భారీ లాభాలను తెచ్చినవే.

దీన్ని బట్టి చూస్తే ప్రేక్షకుడి మైండ్ సెట్ పూర్తిగా మారిందని చెప్పవచ్చు. దర్శక నిర్మాతలు ఇచ్చే ఎంటర్‌టైన్మెంట్ బావుంటే సగటు ప్రేక్షకుడు కూడా సినిమా చూసేందుకు బాగా ఉత్సాహం చూపిస్తారు. చిన్న స్క్రీన్ మీద సినిమా చూస్తున్నామా పెద్ద స్క్రీన్ మీదా చూస్తున్నామా అని ఎవరూ పట్టించుకోరు. ఇలా కూర్చోబెట్టాలంటే కథలో దమ్ముండాలి. దాన్నీ జనాలు నచ్చేలా మెచ్చేలా తీయాలి. ఎలాంటి ప్రేక్షకుడైనా సినిమాను ఆదరించక మానడు. ఇదే విషయాన్ని వెంకటేశ్ తన తాజా చిత్రం దృశ్యం 2తో ద్వారా నిరూపించాడు. 

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago