Connect with us

Featured

కంటెంట్ బావుండాలంతే.. ఎక్కడ రిలీజ్ చేసిన ఆదరిస్తారనడానికి వెంకీనే ఎగ్జాంపుల్..

Published

on

సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్..సినిమా చూడాలంటే ఈ రెండింట్లోనే అనే పద్దతి ఎప్పుడో పోయింది. ఇప్పుడు ట్యాబ్స్, మొబైల్స్ లాంటి వాటిలోను మనకు కావాల్సిన సినిమాను చూసేయొచ్చు. అదే ఇప్పుడు చాలా సినిమాల సక్సెస్‌కు ప్రధాన కారణం అవుతోంది. ఒకప్పుడు సిల్వర్ స్క్రిన్ మీద రిలీజైన సినిమాను చూడాలంటే కనీసం ఓ సంవత్సరం తర్వాతే అని ఉండేది. అప్పుడు బ్లాక్ బస్టర్ అని టాక్ తెచ్చుకున్న సినిమాలు థియేటర్స్‌లోనే 100 రోజులు..150 రోజులు..175 రోజులు..200 రోజులు..225 రోజులు అంటూ ప్రదర్శింపబడుతుండేవి.

ఆ తర్వాత కొన్నాళ్ళకు గానీ ఇదే సినిమా మళ్ళీ స్మాల్ స్క్రీన్ మీద ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుండేవారు. అలా వచ్చిన సినిమాలకు మంచి టీఆర్పీ రేటింగ్ నమోదయ్యేది. ఇప్పుడు అలాకాదు సినిమా ఒక్క షోతోనే హిట్టా..ఫ్లాపా అని డిసైడ్ చేసేస్తున్నారు. అందుకే ఒక్కో సినిమాను మరో సినిమా పోటీ లేకుండా చూసుకొని భారీ సంఖ్యలో థియేటర్స్ లో రిలీజ్ చేసి వారం నుంచి రెండు వారాలలోపే లాభాలు దక్కేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఓ సినిమాను థియేటర్స్‌లో ఉన్నంతవరకే చూడగలము.

ఎత్తేశాక ఇక బుల్లితెరపై వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఓటీటీ పుణ్యమా అని ఎప్పుడు కావాల్సివస్తే అప్పుడు చూడొచ్చు. ఈ సౌలభ్యమే కొన్ని సినిమాలకు మంచి ఆదరణ దక్కేలా చేస్తుంది. కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకుడు ఓటీటీలో చూస్తున్నామా అని ఆలోచించడు. సినిమా చూస్తున్నామా లేదా అని మాత్రమే ఆలోచిస్తారు. అందుకు ఉదాహరణ వెంకటేశ్ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. పెద్ద నిర్మాత, డిస్త్రిబ్యూటర్ అయి ఉండి కూడా అగ్ర నిర్మాత సురేశ్ బాబు థియేటర్స్ లో రిలీజ్ కాకుండా వెంకీ సినిమాలను ఓటీటీలో తీసుకువచ్చి హిట్ అందుకున్నారు.

ఇంతక ముందు తమిళ హిట్ సినిమా అసురన్ తెలుగు రీమేక్ నారప్ప చిత్రం రూపొందించారు. ఈ సినిమాలో వెంకటేశ్ – ప్రియమణి జంటగా నటించారు. తమిళ సినిమా రీమేక్ అనే భావన లేకుండా నారప్ప చిత్రాన్నీ చూసి ప్రేక్షకులు బాగా ఆదరించారు. తాజాగా వచ్చిన దృశ్యం 2 సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు. మలయాళ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అంతక ముందు కోలీవుడ్ స్టార్ హిరో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా, ఇటీవల వచ్చిన జై భీమ్ లాంటి సినిమాలు ఇలా ఓటీటీలో వచ్చి హిట్ టాక్ తెచ్చుకొని భారీ లాభాలను తెచ్చినవే.

దీన్ని బట్టి చూస్తే ప్రేక్షకుడి మైండ్ సెట్ పూర్తిగా మారిందని చెప్పవచ్చు. దర్శక నిర్మాతలు ఇచ్చే ఎంటర్‌టైన్మెంట్ బావుంటే సగటు ప్రేక్షకుడు కూడా సినిమా చూసేందుకు బాగా ఉత్సాహం చూపిస్తారు. చిన్న స్క్రీన్ మీద సినిమా చూస్తున్నామా పెద్ద స్క్రీన్ మీదా చూస్తున్నామా అని ఎవరూ పట్టించుకోరు. ఇలా కూర్చోబెట్టాలంటే కథలో దమ్ముండాలి. దాన్నీ జనాలు నచ్చేలా మెచ్చేలా తీయాలి. ఎలాంటి ప్రేక్షకుడైనా సినిమాను ఆదరించక మానడు. ఇదే విషయాన్ని వెంకటేశ్ తన తాజా చిత్రం దృశ్యం 2తో ద్వారా నిరూపించాడు. 

Advertisement
Continue Reading
Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!