దేశం గర్వించదగ్గ దర్శకుల్లో భారతీరాజా ఒకరు. సమకాలిన చిత్రాలకు భిన్నంగా కథలను రాసుకొని అద్భుత చిత్రాలను రూపొందించి.. ఆరు జాతీయ అవార్డులను పొందారు. గాన గంధర్వుడు బాలసుబ్రమణ్యం చెప్పినట్టుగా ఆయన ఎంచుకునే కథలు 30 సంవత్సరాలు అడ్వాన్స్ గా ఉంటాయని చెప్పారు.
ఒక సందర్భంలో.. బాలు, భారతీరాజా కలిసి ఒకే కారులో ప్రయాణిస్తున్నప్పుడు దారి మధ్యలో ‘రాజా’ ఎప్పుడు కథలు చెబుతూ ఉండేవాడని, ఈ రోజుల్లో ఇలాంటి కథలను సినిమాగా తీస్తే ఎవరు చూస్తారన్నప్పుడు.. తను ఎప్పటికైనా దర్శకుడవుతానని ఈ కథలను సినిమాగా తీసి ప్రేక్షకుల చేత చూపిస్తానని అనే వాడని స్వరాభిషేకంలో..బాలసుబ్రహ్మణ్యం వివరించారు.
తను, భారతీరాజా ఇద్దరు పరిశ్రమకు వచ్చిన కొత్తలో జరిగిన సంఘటన గురించి ఆయన నెమరువేసుకున్నారు. భారతిరాజా తమిళంలో ఎక్కువ సినిమాలను రూపొందించారు. తెలుగులో 1981లో సీతాకోకచిలుక చిత్రాన్ని రూపొందించగా మురళి, ముచ్చర్ల అరుణ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చక్కటి ప్రేమకథ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత జమదగ్ని, టిక్ టిక్ టిక్, యువతరం పిలిచింది, కొత్త జీవితాలు, ఈతరం ఇల్లాలు లాంటి చిత్రాలను రూపొందించారు. 1987 సంవత్సరం వచ్చేసరికి “కడలోర్ కవిదైగళ్’ (సముద్రపు ఒడ్డు కథలు)అనే తమిళ చిత్రాన్ని.. గీతా ఆర్ట్స్ తెలుగులోకి అనువదిస్తూ.. చిరంజీవి, సుహాసిని, రాధిక హీరో, హీరోయిన్లుగా ‘ఆరాధన’ చిత్రాన్ని రూపొందించారు.
తెలుగులో చిరంజీవి చేసిన పాత్రని తమిళంలో ప్రముఖ హీరో సత్యరాజ్ చేయడం జరిగింది. అల్లరి చిల్లరగా తిరిగే రౌడీ నివసించే టౌన్ కు ఒక ఉపాధ్యాయురాలు బదిలీపై వస్తుంది. ఒక విషయంలో హీరోను(రౌడీ) ఉపాధ్యాయురాలు మందలించడంతో ఆమెపై కోపానికి రాకుండా పైగా అభిమానిస్తూ.. నిరక్షరాస్యుడైన హీరో ఆమె దగ్గర చదువు నేర్చుకొని తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటాడు. ఆ క్రమంలో ఉపాధ్యాయురాలు(హీరోయిన్) పులి రాజు(హీరో) ఒకరిపై ఒకరు అభిమానం పెంచుకుంటారు.
అలా కొంత కాలం తర్వాత పెళ్లి చేయాలని వారి పెద్దలు సంబంధాలు చూస్తుంటారు. ఆ క్రమంలో ఉపాధ్యాయురాలిని పెళ్లి చేసుకోవడానికి రాజశేఖర్ వస్తారు. ఉపాధ్యాయురాలు ఆ ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకుంటుందనేదే మిగతా కథ. 1987లో మెగాస్టార్ చిరంజీవి దొంగ మొగుడు,పసివాడి ప్రాణం లాంటి సూపర్ డూపర్ చిత్రాలను అందుకున్నప్పటికీ రాజశేఖర్ తో నటించిన ఆరాధన చిత్రం మాత్రం బాక్స్ ఆఫీసు వద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది.
సినీ నటి అషు రెడ్డి చుట్టూ తాజాగా పెద్ద వివాదం చెలరేగింది. పెళ్లి పేరుతో మోసం జరిగిందని ఆరోపిస్తూ ఒక…
సమోవా వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన యువ క్రీడాకారిణి బెల్లాన భార్గవి అద్భుత ప్రదర్శనతో అందరి…
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…