గత కొన్ని సంవత్సరాల నుంచి బుల్లి తెర పై ప్రసారం అవుతూ అద్భుతమైన రేటింగ్ సొంతం చేసుకుంటున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి అని చెప్పవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది నటీనటులు తమ కెరియర్లో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఈ విధంగా ఎంతో మంది సామాన్య ప్రజలను సెలబ్రిటీలుగా మార్చిన వేదిక జబర్దస్త్ అని చెప్పవచ్చు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా భార్య భర్తల మధ్య జరిగే సన్నివేశాలు, ప్రేమికుల మధ్య జరిగే సన్నివేశాలను ఎక్కువగా చూపిస్తుంటారు.
గతంలో ఈ కార్యక్రమంలో కేవలం మగవారు మాత్రమే ఉండేవారు. ఈ క్రమంలోనే మగవారి ఆడవారి వేషధారణలో నటించేవారు. కానీ జబర్దస్త్ కార్యక్రమంలో చమ్మక్ చంద్ర స్కిట్లు ఏ విధంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఎక్కువగా చమ్మక్ చంద్ర భార్య భర్తల మధ్య జరిగే సన్నివేశాలకు సంబంధించిన స్కిట్ లను చేసేవాడు. ఈ క్రమంలోనే తన స్కిట్ లో భాగంగా బుల్లితెర నటి సత్యశ్రీ ని జబర్దస్త్ వేదికపైకి తీసుకువచ్చారు.
కెరియర్ మొదట్లో పలు సినిమాలలో నటించిన సత్యశ్రీ కు అక్కడ తగినంత గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే చమ్మక్ చంద్ర తనని జబర్దస్త్ వేదికపైకి తీసుకురావడంతో జబర్దస్త్ రూపురేఖలే మారిపోయాయని చెప్పవచ్చు. జబర్దస్త్ వేదికగా తన టాలెంట్ నిరూపించుకున్న సత్య శ్రీ జబర్దస్త్ నుంచి చమ్మక్ చంద్ర వెళ్ళిపోగానే తను కూడా వెళ్ళిపోయింది.
అయితే సత్య శ్రీ ఎంట్రీ ఇవ్వడం ద్వారా ఆ తర్వాత పలువురు జబర్దస్త్ టీమ్ లీడర్స్ తమ స్కిట్ లలో భాగంగా లేడీ కమెడియన్ రోహిణి, వర్ష, పవిత్ర వంటివారు జబర్దస్త్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు. ఈ విధంగా సత్య శ్రీ ఎంట్రీ ఇవ్వడం ద్వారా జబర్దస్త్ వేదిక కలర్ ఫుల్ గా మారిందని చెప్పవచ్చు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…