Featured

ఆ సూపర్ హిట్ పాట కోసం నిర్మాత రామానాయుడు, శ్రీదేవిని ఎందుకు ఎత్తుకున్నారో తెలుసా.?!

రాముడు భీముడు తో ప్రారంభమైన సురేష్ ప్రొడక్షన్స్ ఆ తర్వాత అద్భుతమైన చిత్రాలను తీయడం జరిగింది. 1971లో కె. ప్రకాశరావు దర్శకత్వంలో వచ్చిన ప్రేమనగర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత 1980 వచ్చేసరికి డి.రామానాయుడు తన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఒక చల్లని రాత్రి, కక్ష, అగ్నిపూలు, ప్రేమ మందిరం లాంటి చిత్రాలను తీసి పీకల్లోతు నష్టాల్లో కూరుకు పోయారు. ప్రేమమందిరం సినిమా ప్రేమనగర్ సినిమాల అద్భుత విజయాన్ని సాధిస్తుందని భారీ అంచనాల నడుమ సినిమా విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన నిరాశను చవిచూసింది. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ గారి నాన్న గారైన సత్యమూర్తి ఆ రోజుల్లో ఆంధ్రప్రభ పత్రికలకు కథలు రాసేవాడు.

అందులో వచ్చిన ఒక కథను యువఆర్ట్స్ అధినేత మురారికి నచ్చడంతో సత్యమూర్తిని మద్రాస్ పిలిపించారు. అలా సత్యమూర్తి ని రాఘవేంద్ర రావు దగ్గరికి తీసుకెళ్లి ఒక కథ సత్యమూర్తిచే నిర్మాత మురారి చెప్పించారు. ఎందుకనో ఆ సినిమా రూపు దాల్చలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు డి.రామానాయుడు రాఘవేంద్రరావు కాంబినేషన్ లో ఒక సినిమా అనుకోగా కథ కోసం సత్య మూర్తిని రాఘవేంద్రరావు పిలిపించారు. ఆ కథ డి.రామానాయుడుకు నచ్చడంతో దేవత సినిమా ప్రారంభిద్దాం అనుకున్నారు. కానీ అంతకుముందే అడవి రాముడు, వేటగాడు, కొండవీటి సింహం లాంటి చిత్రాలు తీసిన రాఘవేంద్రరావుకు ఇలాంటి ఫ్యామిలీ చిత్రాన్ని తీయగలరా అని డి.రామానాయుడు అనుకున్నారు. కానీ చివరకు రాఘవేంద్రరావు కే అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ చిత్రానికి సత్యానంద్ ను మాటల రచయితగా ఎంపిక చేసుకున్నారు.

సురేష్ ప్రొడక్షన్స్ లో హీరో శోభన్ బాబు కు దేవత ఏడవ సినిమా, శ్రీదేవికి ఈ చిత్రం మూడవ సినిమా, జయప్రదకు రెండవ సినిమా, రాఘవేంద్రరావుకు ఈ చిత్రమే మొదటి సినిమా. ఈ సినిమాలో పాటలు అత్యద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా వేటూరి రాసిన “వెళ్లువచ్చి గోదారమ్మ వెల్లాకిలా పడ్డాదమ్మో…” అనే పాట దేవత చిత్రం విడుదల అయిన తర్వాత ఆంధ్రదేశమంతటా ఒక ఊపు ఊపేసింది.

ఈ పాట చిత్రీకరణ రాజమండ్రి దగ్గర అగ్రహారంలో గోదావరి తీర ప్రాంతంలో షూటింగ్ జరిపారు. దేవత చిత్రయూనిట్ గోదావరి నదిపై బోటులో ప్రయాణించి ఆ తర్వాత కొంత దూరం బురదలో నడిస్తే లోకేషన్స్ స్పాట్ వచ్చేది. అలా బురదలో నడిస్తే శ్రీదేవి వేసుకున్న కాస్ట్యూమ్స్ పై బురద పడుతుందని నిర్మాత డి.రామానాయుడు శ్రీదేవిని లొకేషన్ స్పాట్ వరకి ఎత్తుకెళ్లేవారు. ఈ పాట కోసం బిందెలను రాజమండ్రి నుంచి తెప్పించారు. అలా ఈ సినిమా 1982లో విడుదలై అత్యద్భుతమైన విజయాన్ని సాధించింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

22 hours ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

22 hours ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

22 hours ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

22 hours ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

22 hours ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

22 hours ago