రాముడు భీముడు తో ప్రారంభమైన సురేష్ ప్రొడక్షన్స్ ఆ తర్వాత అద్భుతమైన చిత్రాలను తీయడం జరిగింది. 1971లో కె. ప్రకాశరావు దర్శకత్వంలో వచ్చిన ప్రేమనగర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత 1980 వచ్చేసరికి డి.రామానాయుడు తన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఒక చల్లని రాత్రి, కక్ష, అగ్నిపూలు, ప్రేమ మందిరం లాంటి చిత్రాలను తీసి పీకల్లోతు నష్టాల్లో కూరుకు పోయారు. ప్రేమమందిరం సినిమా ప్రేమనగర్ సినిమాల అద్భుత విజయాన్ని సాధిస్తుందని భారీ అంచనాల నడుమ సినిమా విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన నిరాశను చవిచూసింది. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ గారి నాన్న గారైన సత్యమూర్తి ఆ రోజుల్లో ఆంధ్రప్రభ పత్రికలకు కథలు రాసేవాడు.
అందులో వచ్చిన ఒక కథను యువఆర్ట్స్ అధినేత మురారికి నచ్చడంతో సత్యమూర్తిని మద్రాస్ పిలిపించారు. అలా సత్యమూర్తి ని రాఘవేంద్ర రావు దగ్గరికి తీసుకెళ్లి ఒక కథ సత్యమూర్తిచే నిర్మాత మురారి చెప్పించారు. ఎందుకనో ఆ సినిమా రూపు దాల్చలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు డి.రామానాయుడు రాఘవేంద్రరావు కాంబినేషన్ లో ఒక సినిమా అనుకోగా కథ కోసం సత్య మూర్తిని రాఘవేంద్రరావు పిలిపించారు. ఆ కథ డి.రామానాయుడుకు నచ్చడంతో దేవత సినిమా ప్రారంభిద్దాం అనుకున్నారు. కానీ అంతకుముందే అడవి రాముడు, వేటగాడు, కొండవీటి సింహం లాంటి చిత్రాలు తీసిన రాఘవేంద్రరావుకు ఇలాంటి ఫ్యామిలీ చిత్రాన్ని తీయగలరా అని డి.రామానాయుడు అనుకున్నారు. కానీ చివరకు రాఘవేంద్రరావు కే అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ చిత్రానికి సత్యానంద్ ను మాటల రచయితగా ఎంపిక చేసుకున్నారు.
సురేష్ ప్రొడక్షన్స్ లో హీరో శోభన్ బాబు కు దేవత ఏడవ సినిమా, శ్రీదేవికి ఈ చిత్రం మూడవ సినిమా, జయప్రదకు రెండవ సినిమా, రాఘవేంద్రరావుకు ఈ చిత్రమే మొదటి సినిమా. ఈ సినిమాలో పాటలు అత్యద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా వేటూరి రాసిన “వెళ్లువచ్చి గోదారమ్మ వెల్లాకిలా పడ్డాదమ్మో…” అనే పాట దేవత చిత్రం విడుదల అయిన తర్వాత ఆంధ్రదేశమంతటా ఒక ఊపు ఊపేసింది.
ఈ పాట చిత్రీకరణ రాజమండ్రి దగ్గర అగ్రహారంలో గోదావరి తీర ప్రాంతంలో షూటింగ్ జరిపారు. దేవత చిత్రయూనిట్ గోదావరి నదిపై బోటులో ప్రయాణించి ఆ తర్వాత కొంత దూరం బురదలో నడిస్తే లోకేషన్స్ స్పాట్ వచ్చేది. అలా బురదలో నడిస్తే శ్రీదేవి వేసుకున్న కాస్ట్యూమ్స్ పై బురద పడుతుందని నిర్మాత డి.రామానాయుడు శ్రీదేవిని లొకేషన్ స్పాట్ వరకి ఎత్తుకెళ్లేవారు. ఈ పాట కోసం బిందెలను రాజమండ్రి నుంచి తెప్పించారు. అలా ఈ సినిమా 1982లో విడుదలై అత్యద్భుతమైన విజయాన్ని సాధించింది.
Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.
ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.
Advertisement
జగన్ అంటే అభిమానం.. ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.
సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.
Advertisement
కార్తీకదీపం డాక్టర్ బాబు.. బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.
Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.
ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.
ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.
Advertisement
సీతాఫలం.. అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.