కొన్ని గొప్ప పనులు అత్యంత సైలెంట్ గా జరుగుతాయి. అద్భుతం బయటకు వచ్చే వరకు ఎవరికీ తెలియదు. అలాగే సినిమా పరిశ్రమలో కొన్ని సినిమాలు చడీ చప్పుడు లేకుండా వచ్చి కనీ వినీ ఎరుగని రీతిలో విజయం సాధిస్తాయి. అసలు ఈ సినిమాలు ఆ రేంజిలో విజయం సాధిస్తాయని జనాలు కాదు కదా.. కనీసం ఆ సినిమా దర్శకులు కూడా ఊహించి ఉండరు. సేమ్ అలాంటి కోవకు చెందినతే ‘యువతరం కదిలింది’ సినిమా.
1980లో విడుదలైన ఈ సినిమాకు సత్యం దర్శకత్వం వహించాడు. నవతరం పిక్చర్స్ బ్యానర్ పై మాదాల రంగారావు రాసి సమర్పించాడు. ఈ సినిమాలో రంగారావుతో పాటు రామకృష్ణ, నారాయణ రావు, మురళీ మోహన్, రంగనాథ్, సాయిచంద్, ప్రభాకర్ రెడ్డి, నాగ భూషణం కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో టైటిల్ సాంగ్ సి నారాయణ రెడ్డి రాశాడు. ఆశయాల పందిరిలో అనురాగం సందడిలో.. అనే పాటను అదృష్ట దీపక్ రాశాడు. ఈ రెండు పాటలు జనాలను విపరీతంగా ఆయకట్టుకున్నాయి.
అటు అదృష్ట దీపక్ రాసిన పాటతోనే ఈ సినిమా పాటల రికార్డింగ్ షురూ అయ్యింది. చలపతిరావు స్వరాలు కూర్చిన ఈ పాటను రామకృష్ణ, విజయలక్ష్మీ శర్మ టీం పాడారు. 1980 మార్చి 26న మద్రాస్ విజయా గార్డెన్స్ లో ఈ కార్యక్రమం మొదలయ్యింది. అయితే ఈ ప్రోగ్రాం అప్పట్లో సంచనలం కలిగించింది. పూజలు, పురస్కారాలు లేకుండానే.. కొబ్బరి కాయులు కొట్టకుండానే ఈ కార్యక్రమం మొదలైంది. సెంటిమెంట్లను పట్టించుకోకుండా ఈ సినిమా మొదలు పెట్టి మాదాల రంగారావు తన పంథాను చాటి చెప్పాడు. కొబ్బరి కాయ కొట్టకుండా సినిమా మొదలు పెట్టడం సినిమా పరిశ్రమలోనే తొలి సారి అంటూ పత్రికలు ప్రత్యేక కథనాలు రాశాయి.
అంతేకాదు.. ఆశయాల పందిరిలో.. పాట రికార్డింగ్ కొనసాగుతుండగానే యువతరం కదిలింది సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాడు దర్శకుడు రంగారావు. అదే ఏడాది ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేశారు. చిన్న బడ్జెట్ తో మొదలైన ఈ సినిమా పెద్ద బడ్జెట్ సినిమాలను వెనక్కి నెట్టి సూపర్ డూపర్ హిట్ కొట్టింది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…