1991 గ్యాంగ్ లీడర్, అసెంబ్లీ రౌడీ, రౌడీ అల్లుడు లాంటి కమర్షియల్ సినిమాలు వచ్చిన సంవత్సరంలో భారత్ బంద్ లాంటి ఓ వివాదాస్పదమైన చిత్రాన్ని కోడి రామకృష్ణ రూపొందించడం జరిగింది. వినోద్ కుమార్, అర్చన, రెహమాన్ కాస్ట్యూమ్ కృష్ణ ప్రధాన పాత్రలో దర్శకుడు ఈ సినిమాను రూపొందించడం జరిగింది.
తన సినిమాలో విలన్స్ ని ప్రత్యేక శైలిలో చూపించే కోడిరామకృష్ణ ఈ సినిమాలో కాస్ట్యూమ్ కృష్ణ ను ఒళ్ళు గగుర్పొడిచే విలన్ పాత్రలో చూపించారు. అంకుశం లో రామ్ రెడ్డి తో బయటపెట్టిన కోడి రామకృష్ణ భారత్ బంద్ లో కాస్ట్యూమ్ కృష్ణ తో ప్రేక్షకులను భయభ్రాంతులకు గురిచేశారు. ఆనాటి సమకాలీన అంశాలను ప్రధాన అంశంగా తీసుకొని భారత్ బంద్ సినిమాను రూపొందించడం జరిగింది. కాస్ట్యూమ్ కృష్ణను పెళ్ళాం చెబితే వినాలి సినిమాలో దర్శకుడు కోడి రామకృష్ణ పరిచయం చేయడం జరిగింది.
పెళ్ళాం చెబితే వినాలి చిత్రంలో మామూలు సాధారణ పాత్రలో కనిపించిన కాస్టూమ్స్ కృష్ణ తర్వాత భారత్ బంద్ లో కనిపించిన కాస్ట్యూమ్ కృష్ణ కి చాలా తేడాను మనం గమనించవచ్చు. కిళ్ళీకొట్టు నడుపుకుంటూ నేరాలు చేసే సామాన్యుడిని ఎమ్మెల్యే తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి కావడం ప్రేక్షకులను అబ్బుర పరుస్తుంది. కాలేజీ లెక్చరర్ గా అర్చన తనదైన నటనను కనబరిచారు. విలన్ తన అనుచరులు సామాన్య ప్రజల్ని ఏవిధంగా మోసం చేస్తున్నారో తెలిసి వాటిని ఖండిస్తుంది.
అయితే ప్రారంభంలో చార్మినార్, అసెంబ్లీ దాని పరిసర ప్రాంతాలు మరియు కర్ఫ్యూ సమయాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోవడం ఉద్రిక్త వాతావరణానికి దారి తీస్తుందని.. ఆ సమయంలో షూటింగ్ వాయిదా వేసుకోవడం లాంటి ఇబ్బందులు ఎదురవుతాయని అప్పుడు నిర్మాతకు దర్శకుడికి మధ్య మనస్పర్ధలు వస్తాయని కోడి రామకృష్ణ భారత్ బంద్ సినిమాకి తానే నిర్మాతగా వ్యవహరించారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…