Categories: FeaturedMovie News

చిరంజీవి,శ్రీదేవి చేజేతుల వదులుకున్న ఆ బ్లాక్ బస్టర్ సినిమా ఏంటో తెలుసా.?!

ఈయన సినిమా ప్రేమికుడు తను కూడా రెండు గుండెల్లో పుట్టే ప్రేమ వాటి మధ్యే ఉండాలని అది ఇతరులకు తెలిసేంతా బాహాటం అవసరం లేదని కోరుకునే అతి సాధారణ వ్యక్తి. అలా ఆయన రాసుకున్నటువంటి ఈ కథను రచయిత ఆత్రేయకు వినిపించారు. అప్పుడు ఇది రెండు హృదయాల మధ్య భావోద్వేగాలను తెలిపే అందమైన ప్రేమ కథ దీన్ని చాలా జాగ్రత్తగా తీయాలని నిర్మాత జి బాబు కి సలహా ఇవ్వడం జరిగింది.

జి.బాబు అలా కథ అనుకున్నాడో లేదో వెంటనే ఆ సినిమాకు సంబంధించిన పాటల కంపోజిషన్ కి ఇళయరాజాను ఎంపిక చేకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆత్రేయ వారం రోజులలోనే మంచు కురిసే వేళలో పాట మినహా మిగతా అన్ని పాటలు రాశాడు. ‌‌జి.బాబు శ్రేయోభిలాషులు, సినీ ప్రముఖులు మేము డబ్బులు ఇచ్చినా అలా రాయడు నీకేమిటి అంత తొందరగా రాశాడని ఆశ్చర్యపోయారు. కథ నచ్చడంతో ఆత్రేయ మనసుపెట్టి ఆ పాటలను రాయడం అవి ప్రేక్షకుల హృదయాంతరాలలో కి వెళ్ళిపోయాయి. స్టోరీ స్లో అండ్ స్టడీగా వెళుతోంది తీయడం బాగుండాలని ఇళయరాజా సలహా ఇచ్చారు. ఇక జి.బాబు నిర్మాత మరియు సినిమాకి కథా రచయిత. ఆయన కథ మొత్తం సిద్ధం చేసుకున్నాడు. ఇక ఈ సినిమాకి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అయిన అశోక్ కుమార్ దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్ గా తన వంతు ప్రతిభను చూపాడు. ఆ కథకు సంబంధించి హీరో, హీరోయిన్లు ఎవరని ఆలోచనలో పడ్డారు. అలా ఈ సినిమాకి చిరంజీవి, శ్రీదేవి అయితే బాగుంటారని ఆలోచించారు.

మూడు, నాలుగు సినిమాలు చేస్తున్న శ్రీదేవి అభినందన సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. తరువాత చిరంజీవి పర్సనల్ మేనేజర్ ని కలవగా చూద్దాం అని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ చిరంజీవి కోసం వెళ్లారు. కానీ చిరంజీవి మేనేజర్ ఓల్డ్ లవ్ స్టోరీ అది మీకు పనికి రాదని చిరంజీవితో చెప్పి.. డేట్స్ ఖాళీ లేవని అభినందన నిర్మాత జి.బాబుకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత చిరంజీవి అభినందన సినిమాను వదులుకున్నారని శ్రీదేవి కూడా ఆ సినిమా చేయడానికి ముందుకు రాలేదు.

అలా వారు ఒప్పుకోకపోవడంతో అన్వేషణ సినిమాలోని హీరో కార్తీక్, వాలుకనుల శోభనను హీరోయిన్ గా పెట్టి 1988లోఅభినందన సినిమా తీశారు. సినిమా చాలా సింపుల్ గా వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఒక విధంగా చెప్పాలి అంటే ఎవరు కూడా ఆ సినిమా అంతగా హిట్ అవుతుందని ఊహించలేకపోయారు. ఆ తరువాత అభినందన సినిమాలోని ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం అనే పాట ఆకాశవాణిలో ప్రతి ఆదివారం ప్రసారమై ఆంధ్ర దేశం అంతటా ఉర్రూతలూగించింది.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago