క్రియేటివ్ కమర్షియల్స్ రేడియోలో వ్యాపార ప్రకటనలతో ప్రారంభమైన ఈ సంస్థ మెగాస్టార్ చిరంజీవి తో అభిలాష, చాలెంజ్ మరణ మృదంగం, స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ లాంటి అత్యధిక సినిమాలను చేయడం జరిగింది. చిరంజీవితో స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ సినిమా తీసి అపజయంతో ఉన్న క్రియేటివ్ కమర్షియల్ అధినేత కె.ఎస్.రామారావు డి.రామానాయుడు తో కలిసి తమిళంలో విడుదలైన చిన్న తంబి సినిమా చూడడం జరిగింది.
ఈ సినిమాలో ప్రభు,ఖుష్బూ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా చూసిన డి.రామానాయుడు ఇది వెంకటేష్ కి సూటు కాదని చెప్పారు. అప్పటికే వెంకటేష్ బొబ్బిలి రాజా వంటి యాక్షన్ సినిమాలు చేస్తున్నాడు. అలాంటి సమయంలో ఒక సాఫ్ట్ రోల్ ని వెంకటేష్ చేయడం అంతగా బాగుండదని డి.రామానాయుడు అనడంతో కె.ఎస్.రామారావు చేసేదిలేక రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ తో సినిమా చేస్తున్నట్టు పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత డి.రామానాయుడు పెద్ద కుమారుడైన సురేష్ బాబు, రెండవ కుమారుడైన వెంకటేష్ కలిసి చిన్న తంబీ సినిమా చూడడం జరిగింది. అది సురేష్ బాబుకు నచ్చడంతో వెంకటేష్ తో ఆ సినిమా చేయమని కె.ఎస్.రామారావు కి ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు వెంకటేష్ డేట్స్ ఉన్నాయని కె.ఎస్.రామారావు రాజేంద్రప్రసాద్ తో చంటి సినిమా రద్దు చేసుకొని వెంకటేష్ హీరోగా సినిమా మొదలు పెడదాం అనుకున్నాడు.
కానీ దీనికి రవిరాజా పినిశెట్టి ఒప్పుకోలేదు. ఇదివరకే రాజేంద్రప్రసాద్ హీరోగా అనుకొని మళ్లీ ఇప్పుడు వెంకటేష్ తో తీయడం కరెక్ట్ కాదని అవసరమైతే సినిమా నుంచి తప్పుకుంటానని చెప్పారు. కె.ఎస్.రామారావు ఏమి చేయాలో అర్థంకాక వెళ్లి చిరంజీవిని కలిశారు. అప్పుడు చిరంజీవి రవిరాజా పినిశెట్టి తో మాట్లాడి వెంకటేష్ హీరోగా చంటి సినిమా ప్రారంభం కావడానికి ప్రయత్నించారు. అలా1991 జూలై 4న మద్రాసులోని క్రియేటివ్ కమర్షియల్స్ ఆఫీసులో చంటి సినిమాని లాంఛనంగా ప్రారంభించారు. రవిరాజా పినిశెట్టి టేకింగ్, ఇళయరాజా అద్భుతమైన బాణీలు సినిమా విజయానికి కారణమయ్యాయి.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…